Share News

NIA: ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

ABN , Publish Date - May 17 , 2025 | 12:00 PM

NIA: ముంబై ఎయిర్‌ పోర్టు దగ్గర ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు. జకార్తా నుంచి ముంబై వచ్చిన అబ్దుల్లా ఫయాజ్‌ షేక్, తల్హా ఖాన్‌లు గత రెండేళ్లుగా పరారీలో ఉన్నారు. ఇప్పుడు జకార్తా నుంచి ముంబై వచ్చిన వారిని విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

NIA: ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
ISIS sympathizers arrest

ముంబై: ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను (ISIS sympathizers) జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ముంబై (Mumbai)లో అరెస్టు చేసింది. అబ్దుల్లా ఫయాజ్‌ షేక్ ( Abdul Fayyaz Shaikh), తల్హా ఖాన్ (Talha Khan) అనే ఇద్దరు ఉగ్రవాదులను ముంబై ఎయిర్ పోర్టులో ఎన్ఐఏ అధికారులు అరెస్టు (Arrest) చేశారు. ఈ ఇద్దరూ 2023 పుణే బాంబు తయారీ కేసు (Pune bomb case)లో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వారిపై ఇప్పటికే ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (on-bailable warrant) జారీ చేసింది. వారిపై రూ. 3 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఉగ్రవాదులిద్దరూ ఇండోనేషియాలో తలదాచుకుంటున్నారు. జకర్తా నుంచి ముంబైకి తిరిగి వచ్చే క్రమంలో ఎన్ఐఏ అధికారులకు చిక్కారు. ఈ ఇద్దరూ గత రెండేళ్లుగా పరారీలో ఉన్నారు.


ఈ ఇద్దరితో పాటు ఇప్పటికే అరెస్టు అయిన మరో 8 మంది ఐఎస్ఐఎస్ స్లీపర్‌సెల్స్‌ సభ్యులపై క్రిమినల్ కుట్ర కేసు నమోదైంది. భారత దేశంలో శాంతి, సామాజిక సామరస్యత లేకుండా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించాలని కుట్ర పన్నుతున్న ఆరోపణలపై వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యకలాపాల ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని.. దేశంలో ఇస్లామిక్ పాలన స్థాపించాలన్న ఉద్దేశంతోనే ఐఎస్ఐఎస్ స్లీపర్‌సెల్స్‌ పనిచేస్తున్నాయని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. గతంలో ఈ ఉగ్రవాదులు పుణేలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బాంబులు తయారు చేశారు. 2022, 23 ఆ ఇంట్లోనే బాంబు తయారీ కేంద్రాలు నిర్వహించారు.

Also Read: నకిలీ ఇళ్ల పట్టాల కేసు.. బెయిల్ కోసం వంశీ పిటిషన్


ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అన్ని చోట్ల వ్యాపింపజేయాలని.. ముఖ్యంగా భారత దేశంలో శాంతి, సామరస్యత లేకుండా అలజడి సృష్టించాలనే ఉద్దేశంతోనే స్లీపర్‌సెల్స్‌‌ను దేశంలో వివిధ ప్రాంతాలకు పంపింది. ఐఎస్ఐఎస్ ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం సీపర్ సెల్స్‌కు శిక్షణ ఇచ్చి బాంబులు ఎలా తయారు చేయాలి, ఎక్కడెక్కడ ఏయే ప్రాంతాల్లో ఎప్పుడు ఎలా పేల్చాలన్న దానిపై ముందుగానే వారికి నోట్ ఇస్తుంది. దీంతో ఉగ్రవాదులు ఎవరికీ అనుమానం రాకుండా విధ్వంసాలకు పాల్పడుతుంటారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కార్ల పన్ను ఎగవేత కేసు.. మరో ఇద్దరిని విచారిస్తున్న డీఆర్ఐ

రీశాట్‌-1బీ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 12:05 PM