Share News

Kakani: కాకాణిని నెల్లూరుకు తీసుకువచ్చిన పోలీసులు

ABN , Publish Date - May 26 , 2025 | 07:03 AM

Kakani Arrest:బెంగళూరులో అరెస్టు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం రుస్తుం మైన్స్‌లో అక్రమంగా కార్ట్జ్‌ ఖనిజం కొల్లగొట్టిన కేసులో పోలీసులకు దొరక్కుండా రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయన్ను ఆదివారం బెంగళూరు శివార్లలో అదుపులోకి తీసుకున్నారు.

Kakani: కాకాణిని నెల్లూరుకు తీసుకువచ్చిన పోలీసులు
Kakani Arrest

నెల్లూరు: ఎట్టకేలకు బెంగళూరు (Bengaluru)లో పోలీసులు అరెస్టు (Arrest) చేసిన వైసీపీ నేత (YCP Leader), మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Ex Minister Kakani Govardhan Reddy)ని నెల్లూరు (Nellore) పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకువచ్చారు. ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో కాకాణిని విచారిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున వెంకటాచలం పీహెచ్‌సీకి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వెంకటగిరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కాకాణి అరెస్టు విషయం తెలుసుకున్నవైసీపీ నేతలు, కార్యకర్తలు నెల్లూరు, వెంకటగిరికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. డీటీసీ దగ్గరకు మీడియాను పోలీసులు అనుమతించలేదు.


బెంగళూరులో అరెస్టు..

కాగా మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం రుస్తుం మైన్స్‌లో అక్రమంగా కార్ట్జ్‌ ఖనిజం కొల్లగొట్టిన కేసులో పోలీసులకు దొరక్కుండా రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయన్ను ఆదివారం బెంగళూరు శివార్లలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన కోసం నెల్లూరు జిల్లా పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో గాలించారు. విమానాశ్రయాలకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలించాయి. ఎట్టకేలకు ఆదివారం బెంగళూరు శివార్లలో ఆయన దొరికిపోయారు. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా పరిధిలోని క్వార్ట్జ్‌ ఖనిజాన్ని ఆ పార్టీ నాయకులు విచ్చలవిడిగా కొల్లగొట్టారు. ఆ క్రమంలో మంత్రి హోదాలో కాకాణి కూడా తన నియోజకవర్గం పరిధిలోని పొదలకూరులో మైన్‌ను అక్రమించుకుని రూ. వందల కోట్ల ఖనిజాన్ని అక్రమంగా తరలించారని టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. అప్పల్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక సోమిరెడ్డి, టీడీపీ నాయకులు అప్పట్లో చేసిన ఫిర్యాదుల్లో కదలిక వచ్చింది. ఈ దోపిడీపై విచారణ జరిపిన అధికారులు సుమారు రూ. 250 కోట్ల విలువైన క్వార్ట్జ్‌ను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. 10 మందిపై మార్చి 24న కేసు నమోదు చేశారు. కాకాణిని ఏ-4గా చేర్చారు.

Also Read: పార్టీ మీ జాగీరా...


నాలుగు ప్రత్యేక బృందాలు...

ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మార్చి 25న నెల్లూరు పోలీసులు కాకాణికి నోటీసులు ఇచ్చారు. అయితే అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నెల్లూరు నివాసంలో ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఇంటి గోడకు నోటీసులు అంటించి వచ్చారు. అనంతరం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి కూడా వెళ్లారు. అక్కడ కూడా ఎవరూ లేకపోవడంతో రెండో నోటీసును కూడా గేటుకు అంటించి వెనుతిరిగారు. ఇదే సమయంలో ఆయన కోసం పోలీసులు ఆయన బంధువుల ఇళ్లవద్దకు వెళ్లారు. ఎక్కడా కనిపించకపోవడంతో మూడో నోటీసును మళ్లీ ఆయన ఇంటి గోడకు అతికించి వచ్చారు. కాకాణి పరారీలో ఉన్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టులకు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. కాకాణిని పట్టుకోవడం కోసం నాలుగు ప్రత్యేక బృందాలను నియమించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యోగాంధ్ర భేష్‌

రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి నైరుతి

For More AP News and Telugu News

Updated Date - May 26 , 2025 | 09:42 AM