Komuram Bheem District: దూసుకొస్తున్న ఏనుగుల గుంపు.. భయాందోళనలో ప్రజలు..

ABN, Publish Date - Jun 03 , 2025 | 02:02 PM

తెలంగాణ కొమురం భీం జిల్లాకు మళ్లీ ఏనుగుల ముప్పు పొంచి ఉంది. సరిహద్దు మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు ఇటువైపు వస్తోంది.

తెలంగాణ కొమురం భీం జిల్లాకు మళ్లీ ఏనుగుల ముప్పు పొంచి ఉంది. సరిహద్దు మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు ఇటువైపు వస్తోంది. ఏనుగుల కదలికలను గుర్తించిన మహారాష్ట్ర అధికారులు.. తెలంగాణ అధికారులకు సమాచారం అందించారు. అహేరీ అటవీ డివిజన్ మీదుగా ప్రాణహిత నది వైపు వస్తున్నాయని అలెర్ట్ చేశారు. దీంతో సిర్పూర్ టీ, కౌటాల, చింతలమానే పల్లి, పెంచికల్ పేట, బెజ్జూరు మండలాలకు ప్రమాదం పొంచి ఉడడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చిరిస్తున్నారు. మరోవైపు పోలీసులు డబ్బు చాటింపే వేసి మరీ సూచిస్తున్నారు. అటవీ ప్రాంతంలోకి ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.


పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Jun 03 , 2025 | 02:02 PM