వెటర్నరీ వెహికల్స్ కొనుగోలులో వైసీపీ భారీ అవినీతి
ABN, Publish Date - Mar 19 , 2025 | 11:52 AM
వెటర్నరీ అంబులెన్సుల కోనుగోళ్లలో గత వైసీపీ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. 14వ రోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో ఇదే అంశంపై కూన రవికుమార్, ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడారు.
అమరావతి: వెటర్నరీ అంబులెన్సుల కోనుగోళ్లలో గత వైసీపీ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. 14వ రోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో ఇదే అంశంపై కూన రవికుమార్, ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడారు. ఒక్కోవాహనం కోనుగోలులో ఫేజ్-1కు ఫేజ్-2కు మధ్య కొన్ని లక్షల రూపాయలు తేడా ఉందని అన్నారు. దీనిపై ఏసీబీతో విచారణ జరిపించాలని కోరారు. అనంతరం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వంలో ఆర్కేవీవై నిధులేగాకుండా అన్ని రకాల ఫండ్లను డైవర్ట్ చేశారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అవినీతికి పాల్పడ్డవారిని వదిలిపేట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వీరిపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
పూర్తి సమాచారం కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి...
CM Chandrababu: వ్యోమగాములపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..
Big Shock To YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. మరో నేత జంప్
Bayyavaram Incident: బయ్యవరం ఘటనపై చంద్రబాబు సీరియస్.. అలా చేయమంటూ ఎస్పీకి ఆదేశం..
Read Latest AP News And Telugu News
Updated at - Mar 19 , 2025 | 12:10 PM