Bomb Threat: వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:38 PM
వరంగల్ కోర్ట్ ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. డయల్100 నెంబర్కి ఫోన్ చేసి చెప్పడంతో పోలీస్ అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.

హనుమకొండ: వరంగల్ కోర్ట్ ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. డయల్100 నెంబర్కి ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కోర్టు ప్రాంగణంలో పెట్టిన ఆరు డిటోనేటర్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సకాలంలో పోలీసుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. కోర్ట్ పరిసరా ప్రాంతాలను పోలీసులు బాంబ్ స్క్వాడ్ సహాయంతో పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను కోర్టు ప్రాంగణం నుంచి దూరంగా పంపించి వేశారు. ఫోన్ ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవరు చేశారనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
విద్యార్థిపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వరల్..
రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు బర్త్డే శుభాకాంక్షలు
భువనేశ్వరికి చంద్రబాబు బర్త్డే విషెస్
Read Latest Telangana News And Telugu News