Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు ప్రారంభం.. భారీగా తరలివస్తున్న భక్తులు..
ABN , Publish Date - May 15 , 2025 | 07:53 AM
Saraswati Pushkaralu: సరస్వతి పుష్కర స్నానాలు గురువారం నుంచి ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. పుష్కరస్నానం చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.

జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర స్నానాలు (Saraswati Pushkaralu) ఇవాళ(గురువారం) నుంచి ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5.45 నిమిషాలకు మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాల సందర్భంగా చేసిన గణపతి పూజలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు పాల్గొన్నారు. ఈ పుష్కరాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇవాళ(మే15) నుంచి మే 26వ తేదీ వరకు 12 రోజులపాటు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. కాగా, ఇవాళ కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన..
సాయంత్రం 4 గంటలకు 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని నదీ తీరంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత సరస్వతి నదీ పుష్కర స్నానం చేయనున్నారు. కాళేశ్వర-ముక్తీశ్వర స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దర్శించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సరస్వతి హారతి కార్యక్రమానికి హాజరవుతారు. పుష్కరాల కోసం రూ.35 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పుష్కరఘాట్లు, తాగునీటి వసతి, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుద్ధ్యానికి దేవాదాయశాఖ ప్రాధాన్యం ఇచ్చింది. ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్లు, పందిళ్లతో భక్తులకు సకల ఏర్పాట్లు చేసింది. సరస్వతి పుష్కరాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం ప్రత్యేక శోభను సంతరించుకుంది.
విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు..
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. జ్ఞాన సరస్వతి ఘాట్ దగ్గర పుష్కర స్నానం చేయడానికి వీఐపీలకు ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం మరో ఘాట్ సిద్ధంగా ఉంచారు. పలు రాష్ట్రాల పీఠాధిపతులు పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. సరస్వతి నదీ పుష్కరాలకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పుష్కరాలకు రోజుకు లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. 12 రోజులపాటు త్రివేణి సంగమంలో కాశీ పండితులతో గోదావరి హారతి ఇవ్వనున్నారు. రోజూ ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ యాగాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6:45 నుంచి 7:35 వరకూ సరస్వతి నవరత్న మాల హారతి ఇవ్వనున్నారు. భక్తుల కోసం కాళేశ్వరంలో టెంట్ సిటీని అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కళ, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకు ప్రభాకర్ రావు
KTR: అందాల పోటీల కోసం పేదల ఇళ్లు కూలుస్తారా?
కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం
High Court: ‘దోస్త్’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ
Sandeep Kumar: సీఎంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ భేటీ
Read Latest Telangana News And Telugu News