Home » Duddilla Sridarbabu
తెలంగాణకు మరో రూ.2125 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు తెలిపారు. యూఏఈకి చెందిన శైవ గ్రూప్, టారనిస్ క్యాపిటల్ కంపెనీలు సంయుక్తంగా ఈ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు.
రాష్ట్రంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 4,100 మంది ఉద్యోగాలు సాధించడంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) కీలక పాత్ర పోషించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
రైతులకు తమ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు.
కాళేశ్వరం విచారణపై మంత్రి శ్రీధర్బాబు కేసీఆర్ చట్టాన్ని గౌరవిస్తారని విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కేసీఆర్ నిజాయితీ నిరూపించకపోతే కఠిన చర్యలు తీసుకునేలా హెచ్చరించారు.
Minister Sridhar Babu: కాళేశ్వరం భూ నిర్వాసితుల పక్షాన తాము నిలబడ్డామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసు కొట్టివేయడం ఇది ప్రజల, రైతుల విజయమని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు.
Saraswati Pushkaralu: సరస్వతి పుష్కర స్నానాలు గురువారం నుంచి ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. పుష్కరస్నానం చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.
ప్రతి జిల్లాలో నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ’ నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్రం మిస్ వరల్డ్ -2025 పోటీదారులకు చౌమహల్లా ప్యాలెస్లో విందు ఏర్పాటు చేసింది. మిస్ వరల్డ్ పోటీదారులు, ప్రతినిధులు హైదరాబాద్ ఆతిథ్యంతో మైమరిపోగా, ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని చెప్పారు.
ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబు సమీక్షించారు. సీఎం రేవంత్రెడ్డికి మంత్రి సురేఖ స్వయంగా ఆహ్వాన పత్రిక అందించారు.
మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడారన్నారు. ప్రభుత్వాన్ని బెదిరించే వ్యాఖ్యల నేపథ్యంలో ఆవేదనతో సీఎం స్పందించారని తెలిపారు.