TG News: తెలంగాణలో అమానుష ఘటన.. బాబోయ్ మరీ ఇంత దారుణమా..
ABN , Publish Date - Jun 10 , 2025 | 08:45 AM
పరిగి మండలం రాపోలు గ్రామంలో దారుణ హత్య జరిగింది. నిన్న(సోమవారం) అర్థరాత్రి తల్లి, కొడుకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

వికారాబాద్ జిల్లా: పరిగి మండలం (Parigi Mandal) రాపోలు గ్రామంలో దారుణ హత్య జరిగింది. నిన్న(సోమవారం) అర్థరాత్రి తల్లి, కొడుకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గండు నర్సమ్మ(60) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. కొడుకు రాజేందర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్రస్తుతం రాజేందర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అతడు పూర్తిగా కోలుకోవాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలానికి చెందిన రాపోలు గ్రామంలో గుండు నర్సమ్మ కుటుంబం నివసిస్తోంది. అయితే సోమవారం అర్థరాత్రి తల్లి నర్సమ్మ, కొడుకు రాజేందర్ నిద్రపోతున్న సమయంలో వారి ఇంట్లోకి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి వారిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నర్సమ్మ తలకు బలమైన గాయాలు అవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె కొడుకు రాజేందర్కి తీవ్ర గాయాలయ్యాయి. వారిపై రాళ్లు, కట్టెలతో దుండగులు అమానుషంగా దాడి చేశారు. ఈ హత్య ఘటన రాపోలు గ్రామాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. రాజేందర్కు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఇతర వైద్య కేంద్రానికి రిఫర్ చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. నర్సమ్మ కుటుంబంతో వీరికి ఏమైనా వ్యక్తిగతంగా తగాదాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. పూర్తి ఆధారాలతో విచారణ జరిపి నిజమైన దోషులను పట్టుకుని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వికారాబాద్ పోలీసు అధికారి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
For More Telangana News and Telugu News..