Home » Telangana Police
హైదరాబాద్లోని మెహిదీపట్నం ప్రాంతంలో పోలీసులపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున సుమారు 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేక విచారణ బృందం ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా, ఈ కేసులో రోహిత్ రెడ్డి, డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ పాత్రపై కీలక ఆధారాలు లభించాయి.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మట్టి తరలింపు విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు బాహాబాహీకి దారితీసింది.
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై హిమాయత్ సాగర్ సమీపంలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
వికారాబాద్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సైబర్ మోసం కేసులో ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్తను నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. మాజీ డీజీపీ మనుమరాలైన బాధితురాలికి చెందిన సంస్థలో వాట్సాప్ ద్వారా మోసం చేసి భారీగా నగదు కాజేశారు.
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్హౌస్ వివాదం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అజీజ్ నగర్లొని ఓ అసైన్డ్ భూమిని ఆక్రమించి ఫామ్హౌస్ కట్టారని ఆరోపణలు వచ్చాయి.
ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోటరీ నగర్ ప్రాంతంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరో ఘటనలో మధిర మండలం ఆత్కూర్ వద్ద శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం జరిగింది
రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం (జుమాతుల్ విదా) ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పలు ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ రూల్స్ని వాహనదారులు గమనించాలని జాయింట్ కమిషనర్ సూచించారు.
మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారులోని కొత్తగుంపులో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలిచివేసింది. కుటుంబ కలహాలు ఒక మహిళ ప్రాణాల మీదకు తీసుకువచ్చాయి. భర్త వీరబోయిన నరేశ్ తన భార్య విజయపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు.