Share News

Miss World 2025: ఆ రెండు ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన.. షెడ్యూల్ ఇదే..

ABN , Publish Date - May 15 , 2025 | 09:15 AM

Miss World contestants: తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా రేవంత్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. పోటీల్లో భాగంగా పలు ప్రాంతాల్లో అందాల భామలు పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.

Miss World 2025:  ఆ రెండు ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన.. షెడ్యూల్ ఇదే..
Miss World contestants

యాదాద్రి: మిస్ వరల్డ్ పోటీదారులు (Miss World contestants) ఇవాళ(గురువారం) రెండు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. టూరిజం విలేజ్ పోచంపల్లికి మిస్ వరల్డ్ పోటీదారులు రానున్నారు. పోచంపల్లి సందర్శనకు ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాల ప్రతినిధులు వెళ్లనున్నారు. ఇవాళ (మే15) సాయంత్రం 6 గంటల నుంచి పోచంపల్లిలో పలు కార్యక్రమాల్లో అందాల భామలు పాల్గొననున్నారు. ఇక్కత్ పట్టుచీరల నేయడంలో పోచంపల్లి ప్రపంచ ఖ్యాతి పొందింది. నేతన్నలతో మాట్లాడి, చీరలు నేసే విధానం గురించి పోటీదారులు తెలుసుకోనున్నారు.


పోచంపల్లి వీధుల్లో పర్యటన, మ్యూజియాన్ని అందాల భామలు సందర్శించనున్నారు. అనంతరం స్థానికులతో వారు మాట్లాడనున్నారు. భూదాన్ పోచంపల్లి ప్రస్థానం, హ్యాండ్లూమ్‌పై ప్రత్యేక వీడియోను ప్రదర్శించనున్నారు. అలాగే యాదగిరిగుట్ట ఆలయానికి మరో మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ల బృందం వెళ్లనున్నారు. ఆలయానికి సాయంత్రం 5 గంటలకు వారు చేరుకుంటారు. ఈ బృందంలో 10 మంది సభ్యులు ఉన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు స్వామి వారి ఆలయాన్ని పోటీదారులు సందర్శించనున్నారు.

miss-world-01.jpg


అందాల భామలకు కోలాటం, బంజారా నృత్యాలతో ఆలయ అధికారులు స్వాగత ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయ ప్రత్యేక అధికారి కిషన్‌రావు నేతృత్వంలో పోటీదారుల బృందానికి ఆహ్వానం పలకనున్నారు. యాదగిరిగుట్ట ఆలయం, విశిష్టత, చారిత్మక నేపథ్యంపై ప్రత్యేక ప్రదర్శన చేయనున్నారు. ఆలయ సందర్శన, ప్రత్యేక పూజలు, ఆశీర్వచనం, గ్రూప్ ఫొటో సెషన్‌లో సుందరీమణులు పాల్గొంటారు. మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు ఆలయానికి రానుండటంతో బ్రేక్ దర్శనం, జోడు సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు.

miss-world.jpg


ఈ వార్తలు కూడా చదవండి

Supreme Court: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకు ప్రభాకర్‌ రావు

KTR: అందాల పోటీల కోసం పేదల ఇళ్లు కూలుస్తారా?

కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం

High Court: ‘దోస్త్‌’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

Sandeep Kumar: సీఎంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ భేటీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 15 , 2025 | 10:30 AM