MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. కాంగ్రెస్, బీజేపీ ఫ్లెక్సీలు కనిపించడం లేదా..
ABN , Publish Date - Jun 04 , 2025 | 08:00 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఫ్లెక్సీలు వదిలేసి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించడం సరికాదన్నారు.

- అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ అధికారులు కాంగ్రెస్, బీజేపీ ఫ్లెక్సీలు వదిలేసి బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు తొలగించడంలో ఆంతర్యమేంటని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో కాంగ్రెస్, బీజేపీ ఫ్లెక్సీలు కనిపించడం లేదా అని ఆయన అధికారులను ప్రశ్నించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి హరీశ్రావు పుట్టిన రోజును పురస్కరించుకుని పార్టీ నాయకులు, ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారని, ఆ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారని అన్నారు.
కేసీఆర్ జన్మదినం రోజున కూడా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించారని, అధికారులకు బీఆర్ఎస్(BRS) ఫ్లెక్సీలు చూస్తే భయమెందుకని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ నిబంధనలు అన్ని పార్టీలకు ఒకేలా ఉంటాయని, బీఆర్ఎస్ పార్టీ ఒకలా... కాంగ్రెస్, బీజేపీకి మరొలా ఉండవన్న విషయాన్ని అధికారులు గ్రహించాలన్నారు. ఇప్పటికైనా అధికారులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి.
అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం
Read Latest Telangana News and National News