Share News

NVSS Prabhakar: ఆ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య డీల్.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 20 , 2025 | 02:13 PM

NVSS Prabhakar: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. దళారులకు ధాన్యం వదిలిపెట్టడంతో ఇష్టారాజ్యంగా మారిందని విమర్శించారు.

NVSS Prabhakar:  ఆ విషయంలో  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య  డీల్.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
NVSS Prabhakar

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కొన్ని వేల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) పూర్తి చేశారని బీజేపీ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) అన్నారు. సాగునీరు ఇచ్చే సమయానికి ఆ ప్రాజెక్టు కుంగిపోయిందని చెప్పారు. కాళేశ్వరం కూలడానికి కారణమేవరో తేల్చడానికి ఇంత ఆలస్యమెందుకని ప్రశ్నించారు. కాళేశ్వరం (Kaleswaram) విచారణను నీరు గార్చేందుకు ప్రయత్నం జరుగుతోందని అన్నారు. విద్యుత్తు కొనుగోళ్ల విషయంలోనూ విచారణను నీరుగార్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య డీల్ కుదరడం వల్లే ఈ విచారణలను పక్కదోవ పట్టిస్తున్నారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.


రేవంత్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. దళారులకు ధాన్యం వదిలిపెట్టడంతో ఇష్టారాజ్యంగా మారిందని విమర్శించారు. ధాన్యం కొనేవారు లేక రైతులు నష్టపోతున్నారని అన్నారు. ధాన్యం కేంద్రాలను మండల స్థాయిలో ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. బీర్లు, భూములు అమ్ముతున్న ప్రభుత్వం తాజాగా రాష్ట్రమంతా అందాల భామలను తిప్పుతోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలస్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపిక రొటీన్ ప్రాసెస్‌లో జరుగుతుందని తెలిపారు. త్వరలో అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Sama Ramamohan Reddy: రజతోత్సవ సభ కాదది.. విచ్ఛిన్న సభ!

Hyderabad fire tragedy: హైదరాబాద్‌ చరిత్రలోనే విషాదకర ఘటన

Farmer Suicide: పొలాల్లో ప్రాణాలొదిలిన నలుగురు రైతులు

Armoor crime: అనుమానంతో భార్యను చంపిన భర్త

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2025 | 02:29 PM