Share News

Seethakka Slams KTR : మీ సత్తా నిరూపించుకోండి.. కేటీఆర్‌కు సీతక్క సవాల్

ABN , Publish Date - May 06 , 2025 | 04:47 PM

Seethakka Slams KTR : స‌త్తా ఉన్న నాయ‌కుడు కేసీఆర్ అయితే.. ప‌త్తా లేకుండా ఎక్క‌డికి వెళ్లారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. స‌త్తా ఉంటే అసెంబ్లీకి వ‌చ్చి సత్తా నిరూపించుకోవాలని హితవుపలికారు. ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చ‌రిత్ర బీఆర్ఎస్ ది అంటూ ఫైర్ అయ్యారు.

Seethakka Slams KTR : మీ సత్తా నిరూపించుకోండి.. కేటీఆర్‌కు సీతక్క సవాల్
Seethakka Slams KTR

హైదరాబాద్, మే 6: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై (Former Minister KTR) మంత్రి సీతక్క (Minister Seethakka), ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ త‌న అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. గ‌త ప్ర‌భుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. కేసీఆర్ అప్పు.. తెలంగాణ భ‌విష్య‌త్తుకు ముప్పుగా దాపురించిందన్నారు. కేసీఆర్ నిర్వాకం వ‌ల్ల నెల‌కు 6 వేల కోట్ల ప్ర‌జాధ‌నాన్ని అప్పుల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వ‌స్తోందని తెలిపారు. స‌త్తా ఉన్న నాయ‌కుడు కేసీఆర్ అయితే.. ప‌త్తా లేకుండా ఎక్క‌డికి వెళ్లారని ప్రశ్నించారు. స‌త్తా ఉంటే అసెంబ్లీకి వ‌చ్చి సత్తా నిరూపించుకోవాలని హితవుపలికారు. ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చ‌రిత్ర బీఆర్ఎస్ ది అంటూ ఫైర్ అయ్యారు.


40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. ఉపాధ్యాయ‌, ఉద్యోగ నాయ‌కుల ఇంటి త‌లుపులు ప‌గుల గొట్టింది ఎవ‌రు కేటీఆర్ అని నిలదీశారు. ఎంద‌రో ఉద్య‌మ‌కారుల‌ను అవ‌మానప‌రిచి బ‌య‌ట‌కు పంపిన చ‌రిత్ర గులాబీ పార్టీ ది అంటూ మండిపడ్డారు. అప్పులు, అమ్మ‌కాలు త‌ప్ప బీఆర్‌ఎస్ చేసిన‌ అభివృద్ది శూన్యమంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ది ఒక గాలి బుడ‌గ అని ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లే తేల్చారన్నారు. బీఆర్‌ఎస్‌ అప్పుల మూలంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయని.. అయినా ఎక్క‌డా సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


కేటీఆర్ మైండ్ దొబ్బంది: చామల

chamala-kirankumar-reddy.jpg

అలాగే కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి కూడా మండిపడ్డారు. కేటీఆర్‌కు మైండ్ దొబ్బిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి సీఎం మాట్లాడారని.. కేటీఆర్‌కు మెడ, కాళ్ల నొప్పులు దెబ్బకే పోయాయంటూ ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. సమ్మె చేయొద్దు.. రాష్ట్రం బాగు చేసుకుందాం అని సీఎం చెప్పారని.. గతం లో 52 రోజులు సమ్మె చేస్తే.. కేసీఆర్ ఒక్క రోజు బయటికి రాలేదని గుర్తు చేశారు. సమ్మె చేస్తున్న వారిని నానా బూతులు ఆ నాడు తిట్టిండని తెలిపారు. రేవంత్ లా సౌమ్యంగా ఎప్పుడు చెప్పలేదన్నారు. ఆ రోజుల్లో సమ్మె చేస్తే ఉద్యోగ సంఘాల్లో శ్రీనివాస్ గౌడ్‌ను ఎమ్మెల్యే చేశారన్నారు. ఉద్యోగ సంఘం నేతలను మాట్లాడకుండా చేశారని మండిపడ్డారు. మిగులు రాష్ట్రాన్ని ఇస్తే 8 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. వాస్తవ పరిస్థితులు చెప్పే ప్రయత్నం సీఎం చేశారని చెప్పుకొచ్చారు.


ఎన్నడూ కేటీఆర్ ఊరికే లేరని.. ప్రతీరోజు తప్పుడు ప్రచారమే చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బిల్లులు రావడం లేదని.. అవన్నీ ఆ నాడు కేసీఆర్ పెట్టి పోయారన్నారు. మిగులు రాష్ట్రం ఇస్తే అప్పుల రాష్ట్రం చేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో దోచుకున్నదే కాకుండా.. మళ్ళీ వచ్చే వాళ్లు పరిపాలన చేయకుండా చేశారన్నారు. ‘తెలంగాణ ప్రజలకు లెక్కలు తెలీవని అనుకుంటున్నావా కేటీఆర్... మీ హయాంలో ఒకటో తారీకు జీతాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా. లక్ష 50 వేల కోట్లు అప్పు కట్టాము. మిస్ వరల్డ‌్‌కు ఖర్చు రూ.250 కోట్లు కాదు.. రూ.27 కోట్లే. కేటీఆర్.. దోపిడీలో భాగస్వామి. తప్పుడు లెక్కలు చెప్పడం భావ్యం కాదు. మీరు దోచుకున్నంత దేశంలో ఎవరూ దోచుకోలేదు. కేటీఆర్‌కు సిగ్గు శరం లేదు. కాళేశ్వరంలో ఓ అధికారి జైలుకి వెళ్ళాడు. మీరు చెప్తేనే కరెక్ట్ అనేది దుర్మార్గపు ఆలోచన. నీ పగటి కలలు నెరవేరవు. రేపటికి రేపు సీఎం కుర్చీలో కేటీఆర్ కూర్చోలేడు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.


కేటీఆర్‌ మాటలు నమ్మొద్దు

‘మూడు ఎకరాలు ఎందుకు ఇవ్వలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగో లేకున్నా సీఎం 21 వేల కోట్ల రుణమాఫీ చేసిండు. రుణమాఫీ చేసినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలా. మేనిఫెస్టో గురించి మాట్లాడే హక్కు కేటీఆర్‌కు లేదు. ఆర్టీసీ సమ్మె 52 రోజులు జరిగితే ఎందుకు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఇల్లు వద్ద పార్కింగ్ లేక ఇబ్బంది పడుతున్నారు. కేటీఆర్ చెప్పిన 2000 ఎకరాలు తీసుకురావాలి. ఆ 2000 ఎకరాలు బయటపెట్టాలి. పిట్ట కథలు చెబుతుండు. చెల్లెను బయటకు పంపాలి.. బావను పడుకోబెట్టాలి అని చూస్తుండు. సీఎం ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తుండు. కేసీఆర్ చేపిందే చెప్పి వన్ మ్యాన్ షో చేసిండు. దెబ్బ తాకి మెదడు దొబ్బిన కేటీఆర్ మాటలు నమ్మొద్దు. బకాయిలు ప్రభుత్వం నెరవేర్చుతుంది’ అని ఎంపీ చామల కిరణ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

Supreme Court Richest Judge: సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో సూపర్‌ రిచ్ ఎవరో తెలుసా

AP Govt: మాతృత్వ సెలవులు ఇక 180 రోజులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2025 | 05:08 PM