Share News

Telangana BJP: బీజేపీ నేతలు అలా చేయొద్దు.. హై కమాండ్ వార్నింగ్

ABN , Publish Date - Jun 01 , 2025 | 10:03 PM

సోషల్ మీడియాలో పార్టీ నేతలపైన వ్యక్తిగతంగా కొంతమంది మాట్లాడిస్తున్నారని.. అలా చేయొద్దని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ హెచ్చరించారు. యూట్యూబ్ ఛానల్స్ వెనుక ఎవరున్నారనేది విచారణ చేస్తున్నామని.. వాటి వెనుక బీజేపీ నేతలు ఎవరైనా ఉన్నట్లు తేలితే వ్యవహారం సీరియస్‌గా ఉంటుందని అభయ్ పాటిల్ వార్నింగ్ ఇచ్చారు.

 Telangana BJP: బీజేపీ నేతలు అలా చేయొద్దు.. హై కమాండ్  వార్నింగ్
Abhay Patil

హైదరాబాద్: సోషల్ మీడియాలో బీజేపీ పార్టీ (Telangana BJP) నేతలపైన వ్యక్తిగతంగా కొంతమంది మాట్లాడిస్తున్నారని.. అలా చేయొద్దని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ (Abhay Patil) హెచ్చరించారు. యూట్యూబ్ ఛానల్స్ వెనుక ఎవరున్నారనేది విచారణ చేస్తున్నామని.. వాటి వెనుక బీజేపీ నేతలు ఎవరైనా ఉన్నట్లు తేలితే వ్యవహారం సీరియస్‌గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ(ఆదివారం) బీజేపీ హెదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో వర్క్ షాప్‌ జరిగింది.


ఈ సమావేశంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభయ్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. సీరియస్ మీటింగ్ జరుగుతంటే కొంతమంది నేతలు వెనుకాల కూర్చుని ముచ్చట్లు పెట్టడం సరికాదని హెచ్చరించారు. మీడియాతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే కుదరదని తేల్చి చెప్పారు. ఎంతటి వారైనా పార్టీ లైనుకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. మూడు, నాలుగు సార్లు గెలిచాం కాబట్టి తాము ఏది మాట్లాడినా సాగుతుందని అనుకోవడం సరైనది కాదని మందలించారు అభయ్ పాటిల్.


నేతలు మాట్లాడే మాటలతో పార్టీకి నష్టం జరుగుతోందని అభయ్ పాటిల్ చెప్పుకొచ్చారు. కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే ఇలా చేస్తే తన దారి తనకు చూపించామని గుర్తుచేశారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తీసిన తిరంగాయాత్ర తెలంగాణలో చాలా బాగా జరిగిందని తెలిపారు. తిరంగా యాత్రలు చేయడంలో తెలంగాణ బీజేపీ టాప్‌లో ఉందని వివరించారు. కర్ణాటకలో కూడా ఇంత బాగా తిరంగాయాత్ర జరగలేదని అభయ్ పాటిల్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వేములవాడలో కొనసాగుతోన్న కోడెల మృత్యు ఘోష.. స్పందించిన కలెక్టర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

For Telangana News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 10:17 PM