Gambhir-Kohli: గంభీర్ వల్లే కోహ్లీ రిటైర్మెంట్.. ఇంత కుట్ర అవసరమా..
ABN , Publish Date - May 13 , 2025 | 09:46 AM
Team India: దాదాపుగా దశాబ్దంన్నర కాలం భారత టెస్ట్ జట్టు బ్యాటింగ్ భారాన్ని మోసిన టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ వెల్లడించాడు. అయితే కోహ్లీ వైదొలగడం వెనుక కోచ్ గంభీర్ పాత్ర ఉందని వినిపిస్తోంది.

టెస్టులను ఎంతో ప్రేమించే టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆ ఫార్మాట్కు గుడ్బై చెప్పేశాడు. అద్భుతమైన బ్యాటింగ్, కెప్టెన్సీతో సుదీర్ఘ ఫార్మాట్పై తనదైన ముద్ర వేసిన కింగ్.. ఫేర్వెల్ లేకుండానే రిటైర్ అయ్యాడు. ఇక మీదట అతడు వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు. అయితే అసలు ఉన్న పళంగా కోహ్లీ ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మంచి ఫామ్, ఫిట్నెస్ ఉన్నా ఆటకు వీడ్కోలు చెప్పాల్సిన అవసరం ఏం వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనంతటికీ హెడ్ కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కారణమని నెట్టింట రూమర్స్ వస్తున్నాయి. గౌతీ వల్లే విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడని వినిపిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ఎందుకిలా చేశారు..
గంభీర్-అగార్కర్ ప్లాన్ చేసి మరీ కోహ్లీని సాగనంపారని పుకార్లు వస్తున్నాయి. విరాట్ అంటే గౌతీకి అసూయ అని అందుకే అతడ్ని బయటకు పంపేశాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓడినందుకు రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని రిటైర్ అయ్యేలా చేశారని.. ఇది దారుణమని సీరియస్ అవుతున్నారు. కుట్ర పన్ని టీమ్లో సీనియర్లు లేకుండా చేశారని మండిపడుతున్నారు. రాహుల్ ద్రవిడ్ హయాంలో పైప్లేయర్లు అద్భుతంగా రాణించారని.. గంభీర్ కోచింగ్లో వాళ్ల కాన్ఫిడెన్స్ దెబ్బతిందని, దీనికి తోడు అతడి పాలిటిక్స్ నచ్చకే బయటకు వెళ్లిపోయారని కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లండ్ సిరీస్లో గనుక భారత్ విఫలమైతే గంభీర్కు బీసీసీఐ చేతుల్లో దబిడిదిబిడేనని అంటున్నారు. సీనియర్లను బయటకు పంపి ఏం సాధిస్తారంటూ గంభీర్-అగార్కర్ను ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. గంభీర్ హయాంలో వరుసగా 2 సిరీస్లు కోల్పోయాం, డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోలేకపోయాం, ముగ్గురు అత్యుత్తమ ఆటగాళ్లు జట్టును వీడారు.. ఇదీ అతడి ఘనత అంటూ దుయ్యబడుతున్నారు.
ఇవీ చదవండి:
ఐపీఎల్పై ఆసీస్ బోర్డు ట్విస్ట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి