Kohli-Anushka: కొడుకుపై అనుష్కకు ఎంత ప్రేమో.. విరాట్ ఫ్యామిలీ వీడియో వైరల్
ABN , Publish Date - May 15 , 2025 | 12:05 PM
Team India: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ.. ఫ్యామిలీతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబంతో కలసి అతడు దిగిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్కు షాకిస్తూ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించిన కొద్ది రోజులకే కింగ్ కూడా వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నాడు విరాట్. సతీమణి అనుష్క శర్మ, కూతురు వామిక, కొడుకు అకాయ్తో కలసి ఆలయాలకు వెళ్తున్నాడు. బృందావనానికి వెళ్లి ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్న విరాట్.. అటు నుంచి అయోధ్యలోని అత్తగారింటికి బయల్దేరాడు. అయితే అక్కడ విరుష్క దిగిన ఫొటోలతో కూతురి కంటే కొడుకుపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..
కూతురికి దూరంగా..
అయోధ్యలోని అత్తగారింటికి వెళ్లాడు కోహ్లీ. దీంతో అనుష్క తల్లి బయటకు వచ్చి మరీ విరాట్ను ఇంట్లోకి ఆహ్వానించారు. అనుష్కను కౌగిలించుకొని.. తన చేతుల్లో ఉన్న అకాయ్ను ఎత్తుకున్నారు. అయితే వామికాను మాత్రం పట్టించుకోలేదు. వీళ్లకు వెనుక వైపు కారు డోర్ను క్లోజ్ చేస్తూ కనిపించాడు కోహ్లీ. దీంతో అనుష్క కొడుకు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తోందని.. కూతుర్ని దూరం పెడుతోందని కొందరు నెటిజన్స్ లేని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై కింగ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇద్దరు పిల్లల్ని విరుష్క సమానంగా చూస్తారని, ఏదో ఒక వీడియోను.. అందునా ఒక క్లిప్పింగ్ చూపించి ఇలా మాట్లాడేస్తారా అంటూ దుయ్యబడుతున్నారు. అర్థంపర్థం లేని వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. కాగా, రిటైర్మెంట్ తర్వాత తక్కువ వ్యవధిలోనే ఐపీఎల్-2025లో దర్శనమివ్వనున్నాడు విరాట్. అతడి బ్యాటింగ్ మెరుపుల్ని చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి