Share News

Virat Kohli: ప్లేఆఫ్స్‌కు ముందు హనుమాన్ ఆలయానికి కోహ్లీ.. ఏం కోరుకున్నాడంటే..!

ABN , Publish Date - May 25 , 2025 | 02:54 PM

ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌కు ముందు మరో ఆలయాన్ని సందర్శించాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గఢీ గుడికి వెళ్లాడు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Virat Kohli: ప్లేఆఫ్స్‌కు ముందు హనుమాన్ ఆలయానికి కోహ్లీ.. ఏం కోరుకున్నాడంటే..!
Virat Kohli

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయాడు. సతీమణి అనుష్క శర్మతో కలసి ప్రసిద్ధ ఆలయాలను సందర్శిస్తున్నాడు. రిటైర్‌మెంట్ తర్వాత మొదట బృందావన్‌లోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్‌ను కలసి ఆశీస్సులు తీసుకున్నారు కోహ్లీ దంపతులు. ఆ తర్వాత ఐపీఎల్‌ రీస్టార్ట్‌ అవడంతో బిజీ అయిపోయిన కింగ్.. తాజాగా ఇంకో ఆలయానికి వెళ్లాడు. అయోధ్యలోని హనుమాన్ గఢి గుడిని సందర్శించారు విరాట్ దంపతులు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కోహ్లీ ఏం కోరుకున్నాడనే చర్చలు ఊపందుకున్నాయి.

Virat-Kohli-At-Ayodhya.jpg-1.jpg


తీరని కల!

ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌కు కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో ఆర్సీబీని గెలిపించాలని హనుమంతుడ్ని కోహ్లీ కోరుకొని ఉండొచ్చని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఇన్నేళ్లలో బెంగళూరు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. కాబట్టి ఆ కోరిక నెరవేర్చమని ఆంజనేయుడ్ని విరాట్ విన్నవించుకొని ఉండొచ్చని చెబుతున్నారు. సుదీర్ఘ కెరీర్‌లో ఫేమ్, క్రేజ్‌తో పాటు వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీ.. ఇలా అన్ని ట్రోఫీలు, అవార్డులు, రివార్డులు కోహ్లీ అందుకున్నాడని, కానీ ఐపీఎల్ ట్రోఫీ కల అలాగే ఉండిపోయిందని చెబుతున్నారు. కాబట్టి ఈసారి ఆర్సీబీని చాంపియన్‌ చేయమని హనుమయ్యను విరాట్ ప్రార్థించి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.


విరుష్క భక్తికి ఫిదా..

విరుష్క దంపతులకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. గతంలో ఉజ్జయిన్‌లోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయాన్ని వీళ్లు సందర్శించారు. అలాగే ఇతర పుణ్యక్షేత్రాలకు కూడా వీలున్నప్పుడు వెళ్తూ వస్తున్నారు. ఈ కోవలోనే ఇటీవల ప్రేమానంద్ మహారాజ్‌ను కలిశారు. తాజాగా హనుమాన్ గఢి ఆలయాన్ని సందర్శించారు. సాంప్రదాయ దుస్తుల్లో ఈ జంట ఎంతో వినయంగా పూజలు చేస్తూ కనిపించారు. నెట్టింట వైరల్ అవుతున్న వీళ్ల ఫొటోలు చూసిన నెటిజన్స్.. వీళ్ల భక్తిని మెచ్చుకుంటున్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుష్క ఇస్తున్న ప్రాధాన్యతను మెచ్చుకుంటున్నారు.


ఇవీ చదవండి:

నవతరం నాయకుడు వచ్చాడు

25 వేటలో జొకో

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 25 , 2025 | 03:00 PM