Share News

Rohit Sharma: ఇది మనందరి బాధ్యత.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 05 , 2025 | 02:46 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిమానులకు ఓ సందేశం ఇచ్చాడు. ఇది మనందరి బాధ్యత అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ హిట్‌మ్యాన్ దేన్ని ఉద్దేశించి అలా మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: ఇది మనందరి బాధ్యత.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rohit Sharma

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ ఎట్టకేలకు ముగిసింది. దీంతో ఆటగాళ్లు తమ కెరీర్ మీద దృష్టి సారిస్తున్నారు. ఇంటర్నేషనల్ సిరీస్‌ల్లో ఆడేవారు అక్కడ రాణించాలని చూస్తున్నారు. దేశానికి ఆడే అవకాశం దక్కనివారు దేశవాళీల్లో రాణించి తమ రాత మార్చుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందరికీ ఓ ప్రత్యేకమైన సందేశం ఇచ్చాడు. అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరాడు. కాపాడాల్సిన ఆవశ్యకత ఉందంటూ కర్తవ్యాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేశాడు. ఇంతకీ హిట్‌మ్యాన్ దేన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం..


భావి తరాల కోసం..

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ భూమిని ఆర్యోగకరంగా మార్చి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కచ్చితంగా మనందరి మీద ఉంది. దీన్ని అంతా గుర్తుంచుకోవాలి. ఈ గ్రహాన్ని నివాసయోగ్యంగా మలచడం కూడా మన చేతుల్లోనే ఉంది’ అని ప్రముఖ జీవశాస్త్రవేత్త డేవిడ్ అటెన్‌బరో కొటేషన్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు హిట్‌మ్యాన్. దీనికి వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. రోహిత్ లాంటి సెలెబ్రిటీలు పర్యావరణ పరిరక్షణపై మరింతగా ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. హిట్‌మ్యాన్ వంటి విశేష ప్రజాదరణ కలిగిన ప్రముఖులు చెబితే ఇలాంటి విషయాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రోహిత్ ప్రాతినిధ్యం వహించిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2025లో ఫైనల్స్‌కు వెళ్లలేకపోయింది. క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతుల్లో ఓడి ఇంటిదారి పట్టిందా టీమ్.


ఇవీ చదవండి:

పోలీసులు వద్దన్నా ఆర్సీబీ వినలేదా?

ప్రశాంతంగా నిద్రపోతా: కోహ్లీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 02:57 PM