Vijay Mallya: కల నెరవేరిందన్న విజయ్ మాల్యా.. గాలి తీసేసిన ఎస్బీఐ!
ABN , Publish Date - Jun 05 , 2025 | 09:33 AM
ఆర్సీబీ తొలి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ఆ టీమ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కల నెరవేరిందంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆయన గాలి తీసేసింది ఎస్బీఐ.

18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని ఎట్టకేలకు కైవసం చేసుకుంది ఆర్సీబీ. ఐపీఎల్-2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి చాంపియన్గా అవతరించింది. దీంతో ఆ జట్టు అభిమానుల సంతోషానికి హద్దుల్లేకుండా పోయాయి. ఆర్సీబీ మాజీ ఓనర్ విజయ్ మాల్యా కూడా ఈ గెలుపు మీద హర్షం వ్యక్తం చేశారు. టీమ్ అద్భుతంగా ఆడిందని, 18 సంవత్సరాల తర్వాత చాంపియన్గా నిలిచిందంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్కు అభినందనలు తెలిపారు. అయితే మాల్యా గాలి తీసేసింది ఎస్బీఐ. అసలేం జరిగిందంటే..
భారత్కు వచ్చేయ్..
ఆర్సీబీ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ విజయ్ మాల్యా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్పై తెగ ట్రోలింగ్ నడుస్తోంది. మాల్యా ఇండియాకు వచ్చేయ్.. ఇక్కడ కలసి సెలబ్రేట్ చేసుకుందామంటూ కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఫస్ట్ బ్యాంకుల నుంచి తీసుకున్న బాకీ చెల్లించు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే తరుణంలో ‘సార్.. భారత్కు రండి. మనం కలసి సెలబ్రేట్ చేసుకుందాం’ అంటూ మాల్యా పోస్ట్కు ఎస్బీఐ పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన రిప్లై తెగ వైరల్ అవుతోంది. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన మెసేజా.. కాదా.. అనేది క్లారిటీ లేదు. అయితే ఈ రిప్లై మాత్రం ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్స్.. మాల్యా గాలి తీసేశారని, వాటే రిప్లై అంటూ మెచ్చుకుంటున్నారు. విదేశాల్లో కూర్చొని పోస్ట్లు పెట్టడం కాదు.. ముందు ఇండియాకు రా అంటూ మాల్యాపై సీరియస్ అవుతున్నారు. కాగా, బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారయ్యారు మాల్యా.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి