Share News

RCB IPL 2025: ఎవరు గెలిస్తే ఆర్సీబీకి బెనిఫిట్.. కప్పు చేజారినట్లేనా?

ABN , Publish Date - Jun 01 , 2025 | 06:30 PM

పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులతో పాటు ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ రిజల్ట్‌తో మరో ఫైనలిస్ట్ ఎవరో తేలుతుంది. కాబట్టి ఎవరు నెగ్గుతారా.. అనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

RCB IPL 2025: ఎవరు గెలిస్తే ఆర్సీబీకి బెనిఫిట్.. కప్పు చేజారినట్లేనా?
IPL 2025 Qualifier 2

ఐపీఎల్-2025 చివరి దశకు చేరుకుంది. నేటితో ప్లేఆఫ్స్ ముగిసిపోతుంది. ఇప్పటికే ఓ ఫైనలిస్ట్ ఎవరో స్పష్టత వచ్చేసింది. తొలి కప్పు వేటలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫైనల్స్‌కు చేరుకుంది. మరో బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ చూస్తున్నాయి. ఈ రెండు హేమాహేమీల నడుమ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అటు పంజాబ్, ఇటు ముంబై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ జట్టు గెలవాలంటే, తమ జట్టు గెలవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అయితే వీళ్లతో పాటు ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఓ కోరిక కోరుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..


రెచ్చిపోతారు..

క్వాలిఫయర్-2 పోరులో పంజాబ్ కింగ్స్ నెగ్గాలని చాలా మంది ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. ఆ జట్టు ఫైనల్‌కు వస్తే తమకు ఢోకా లేదని.. కప్పు కొట్టేస్తామని అంటున్నారు. దీనికి కారణం ముంబై ఇండియన్స్‌కు ఉన్న రికార్డు అనే చెప్పాలి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 6 సార్లు ఫైనల్స్‌కు చేరుకుంది ఎంఐ. ఇందులో 5 సార్లు ఆ టీమ్ ట్రోఫీని గెలుచుకుంది. కేవలం ఒక్కసారి మాత్రమే రన్నరప్‌గా నిలిచింది. దీన్ని బట్టి ముంబై కప్ ఫైట్‌లో ఎలా పోరాడుతుందో, ఎంతగా రెచ్చిపోయి ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు.


కప్పు కొట్టాల్సిందే..

ముంబై గనుక ఫైనల్‌కు వస్తే ఆర్సీబీ ఖేల్‌ఖతం అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఫైనల్స్‌కు వస్తే కప్పు కొట్టి తీరాల్సిందే అనేలా ఎంఐ ఆడుతుంది. కాబట్టి ఆ జట్టును ఓడించడం అంత ఈజీ కాదని చెబుతున్నారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి స్టార్లకు ఐపీఎల్ ఫైనల్స్‌‌లో ఆడిన అనుభవం ఉంది. ఆ మ్యాచ్‌లో ఉండే ఒత్తిడిని తట్టుకొని అంచనాలకు తగ్గట్లు రాణించడం, ప్రత్యర్థిని ప్రెజర్‌లోకి నెట్టడం ఎలాగో తెలుసు. అటు ఆర్సీబీ చాలా ఏళ్ల తర్వాత ఫైనల్స్‌కు వచ్చింది. కాబట్టి ఒత్తిడి, అంచనాలను తట్టుకొని రాణించడం కష్టతరం అవుతుంది. అందుకే ముంబై కంటే పంజాబ్ ఫైనల్‌కు వస్తే తమకు బెటర్ అని ఆర్సీబీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. పైగా పంజాబ్ ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. ఇది బెంగళూరుకు బిగ్ ప్లస్ అవుతుందని అంటున్నారు. మరి.. ఇవాళ్టి పోరులో ఏ టీమ్ నెగ్గుతుందో చూడాలి.


ఇవీ చదవండి:

స్పిన్ మాంత్రికుడు వస్తున్నాడు

వాన గండం.. ఫైనల్ వెళ్లేదెవరు?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 06:33 PM