Share News

BCCI-Team India: కొత్త కెప్టెన్‌పై తేల్చేసిన బీసీసీఐ.. ఈ డేట్ వరకు ఆగితే చాలు!

ABN , Publish Date - May 21 , 2025 | 07:45 PM

నయా కెప్టెన్‌పై బీసీసీఐ తేల్చేసిందని తెలుస్తోంది. కొత్త సారథితో పాటు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే పూర్తి జట్టును బోర్డు త్వరలో ప్రకటించనుందట. మరి.. ఆ తేదీ ఎప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం..

BCCI-Team India: కొత్త కెప్టెన్‌పై తేల్చేసిన బీసీసీఐ.. ఈ డేట్ వరకు ఆగితే చాలు!
Team India

రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో భారత టెస్ట్ జట్టు కొత్త సారథి ఎవరనే చర్చలు ఊపందుకున్నాయి. శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా.. ఇలా కెప్టెన్సీ రేసులో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నలుగురిలో ఏదో ఒక పేరు ఖాయమవుతుందని డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ తరుణంలో రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టుతో పాటు నయా టెస్ట్ కెప్టెన్ ఎవరనేది బీసీసీఐ తేల్చేసిందని తెలుస్తోంది. మే 24వ తేదీన ఈ విషయంపై బోర్డు నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. దీని గురించి మరింతగా చూద్దాం..


ఆ రోజే అనౌన్స్‌మెంట్!

జూన్ 20వ తేదీ నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది భారత్. 5 మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లీష్ టీమ్‌తో తలపడనునుంది టీమిండియా. దీనికి సంబంధించిన భారత జట్టుతో పాటు కొత్త కెప్టెన్ ఎవరనేది మే 24న సెలెక్ట్ చేసే చాన్స్ ఉందని సమాచారం. శనివారం సెలెక్షన్ కమిటీ మీటింగ్ తర్వాత దీనిపై ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఇప్పటికే సారథి ఎవరనేది బోర్డు పెద్దలు డిసైడ్ అయ్యారని.. ఆ తేదీన అధికారికంగా ప్రకటిస్తారని, ఆ డేటే డెడ్‌లైన్ అని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి.


ఇద్దరిలో ఎవరు?

టీమిండియా కొత్త కెప్టెన్ అంశం గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు గిల్ ఈ రేసులో ముందున్నాడని, కానీ సుదీర్ఘ అనుభవం కలిగిన బుమ్రా అతడ్ని దాటేశాడని వినిపిస్తోంది. అయితే వర్క్‌లోడ్ నేపథ్యంలో బుమ్రా కావాలనే ఈ రేసు నుంచి తప్పుకున్నాడని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. దీంతో బీసీసీఐ మళ్లీ గిల్ వైపు చూస్తోందట. పంత్, రాహుల్ లాంటి ఇతర ఆప్షన్లు ఉన్నప్పటికీ ఫ్యూచర్‌లో అన్ని ఫార్మాట్‌లకు ఒకే సారథి ఉండాలనే ఉద్దేశంతో గిల్‌‌నే ఖరారు చేయాలని చూస్తున్నారట. అయితే టెస్ట్ టీమ్‌లో శుబ్‌మన్ స్థానం ఇంకా సుస్థిరం కాలేదు. అలాంటప్పుడు కెప్టెన్సీ ఇవ్వడం చాలా రిస్క్ అని సెలెక్టర్లలో ఒకరు అభ్యంతరం తెలిపారని వినిపిస్తోంది. ఏదేమైనా ఈ వారాంతంలో కొత్త సారథిపై పూర్తి క్లారిటీ రావడం ఖాయంగా కనిపిస్తోంది.


ఇవీ చదవండి:

కటౌట్ ఎత్తుకెళ్లిన కమిన్స్

సాకులు చెబుతున్న ధోని

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 21 , 2025 | 08:31 PM