Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్పై అనుష్క రియాక్షన్.. కథ చెప్పాడంటూ..
ABN , Publish Date - May 14 , 2025 | 02:58 PM
Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్బై చెప్పేశాడు. ఫామ్, ఫిట్నెస్ ఉన్నా.. అలవోకగా మరికొన్నేళ్లు ఆడే సత్తా ఉన్నప్పటికీ రిటైర్మెంట్ ప్రకటనతో అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు విరాట్. ఈ విషయంపై తాజాగా అతడి సతీమణి అనుష్క శర్మ స్పందింది. ఆమె ఏం అందంటే..

టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్కు ముగింపు పలికాడు భారత టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆటగాడిగా, సారథిగా ఈ ఫార్మాట్లో ఎన్నో అరుదైన ఘనతల్ని అందుకున్న కింగ్.. రెండ్రోజుల కింద రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫామ్, ఫిట్నెస్ ఉన్నా అతడు అనూహ్యంగా టెస్టుల నుంచి తప్పుకోవడం అభిమానుల్ని షాక్కు గురిచేస్తోంది. ఈ తరుణంలో విరాట్ సతీమణి అనుష్క శర్మ ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీని పోస్ట్ చేసింది. అందమైన కథ చెప్పాడంటూ కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తింది.
ఇదో కవితాత్మక ఆట
కథ చెప్పాడు, సక్సెస్ అయ్యాడంటూ కోహ్లీని మెచ్చుకుంది అనుష్క. టెస్ట్ క్రికెట్లో అందమైన కథ చెప్పగలిగే వారు మాత్రమే విజయవంతం అవుతారని చెప్పిన అనుష్క.. విరాట్ కథ చాలా సుదీర్ఘమైనది, లోతైనదని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. టెస్ట్ క్రికెట్ అనేది ఓ కవితాత్మక ఆట అని.. అందుకే ఇతర ఫార్మాట్ల కంటే ఇది చాలా ప్రత్యేకమైనదని పేర్కొంది. 5 రోజులు, 4 ఇన్నింగ్స్లు, 22 మంది స్పెషలిస్ట్లు ఆడే ఆట అని.. ఒక్కోసారి ఆడుతున్న సమయంలోనే వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తాయని అనుష్క చెప్పుకొచ్చింది.
కన్నీళ్లే గుర్తుంటాయ్..
టెస్ట్ క్రికెట్ ఓ సాహిత్య నవల లాంటిదని.. కథను అందంగా చెప్పేవారే ఈ ఫార్మాట్లో సక్సెస్ అవుతారని అనుష్క ఇన్స్టాలో పంచుకుంది. అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించి మాట్లాడితే తనకు మాత్రం ఎప్పుడూ చూపించని కన్నీళ్లు, ఎవరికీ తెలియని యుద్ధాలు గుర్తుండిపోతాయని పేర్కొంది అనుష్క. ఆమె పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భర్తతో పాటు అతడి ఆటనూ ఆమె భలేగా అర్థం చేసుకుందని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. అనుష్క అండగా ఉంది కాబట్టే కింగ్ ఇన్నాళ్లూ గేమ్లో ఇరగదీశాడని అంటున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి