Asia Cup Trophy Controversy: ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 06:34 PM
శనివారం నాడు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడారు. ఐసీసీ సమావేశానికి పీసీబీ ఛైర్మన్ నఖ్వీ కూడా హాజరయ్యారని, అజెండాలో లేనప్పటికీ తాను, నఖ్వీ.. ఐసీసీ అధికారుల సమక్షంలో భేటీ అయ్యామని సైకియా అన్నారు. చర్చల ప్రక్రియ ప్రారంభం కావడం బాగుందని, ఇరు పక్షాలూ ఈ సమావేశంలో సహృదయంతో పాల్గొన్నాయని తెలిపారు.
ఆసియా కప్ ట్రోఫీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. దీంతో అసలు భారత్ కు ఆ ట్రోఫీ చేరుతుందా, లేదా? అనే సందేహాలు ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని మదిలో ఉన్నాయి. అయితే తాజాగా ఈ ట్రోఫీ వివాదంపై బీసీసీ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ (Asia Cup) ట్రోఫీ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని బీసీసీఐ (BCCI), పీసీబీ చీఫ్ నఖ్వీ.. ఒక అభిప్రాయానికి వచ్చారని ఆయన తెలిపారు. దుబాయ్లో ఐసీసీ (ICC) సమావేశం సందర్భంగా.. నఖ్వీతో జరిగిన చర్చలు విజయవంతమయ్యాయని, వివాద పరిష్కారానికి ఇరు పక్షాలూ సానుకూలంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ఇవాళ(శనివారం) బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడారు. ఐసీసీ సమావేశానికి పీసీబీ ఛైర్మన్ నఖ్వీ కూడా హాజరయ్యారని, అజెండాలో లేనప్పటికీ తాను, నఖ్వీ.. ఐసీసీ అధికారుల సమక్షంలో భేటీ అయ్యామని సైకియా అన్నారు. చర్చల ప్రక్రియ ప్రారంభం కావడం బాగుందని, ఇరు పక్షాలూ ఈ సమావేశంలో సహృదయంతో పాల్గొన్నాయని తెలిపారు. మొత్తంగా ఆసియా కప్ ట్రోఫీ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని సైకియా స్పష్టం చేశారు.
ఆసియా కప్(Asia Cup Trophy controversy)లో పాకిస్థాన్ ప్లేయర్లకు భారత్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వని సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంపై దాడి చేసిన నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలానే ఈ టోర్నీలో పాకిస్థాన్ తో జరిగిన మూడు మ్యాచుల్లో భారత్ ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. సెప్టెంబర్ 28న ఆసియా కప్ ఫైనల్లో పాక్ను ఓడించి టీమిండియా విజేతగా నిలిచింది. దీంతో పాకిస్థాన్ కు చెందిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ నఖ్వీ (Nakhvi) నుంచి ట్రోఫీ అందుకోవడానికి కూడా భారత్(India cricketers) ఆసక్తి చూపలేదు. అయితే ఆయన మరొకరి చేతుల మీదుగా ట్రోఫీ, మెడల్స్ను అందించే ప్రయత్నం చేయకుండా వాటిని తనతోపాటు ట్రోఫీని తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. తాజాగా బీసీసీ(BCCI) కార్యదర్శి వ్యాఖ్యలతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
2028 Olympics: భారత్, పాక్ పోరు లేనట్లేనా..?
ND vs SA Unofficial Test: అదరగొట్టిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి