Share News

Breaking News: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు..

ABN , First Publish Date - Jul 12 , 2025 | 09:29 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు..
Breaking News

Live News & Update

  • Jul 12, 2025 19:44 IST

    నంద్యాల : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు.

    • ఒక రేడియల్ క్రెస్టు గేట్ పది అడుగుల మేర ఎత్తివేత

    • ఇన్ ఫ్లో : 1,39,297 క్యూసెక్కులు.

    • ఔట్ ఫ్లో : 95,534 క్యూసెక్కులు

    • పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులు

    • ప్రస్తుతం : 883.00 అడుగులు

    • పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.8070

    • ప్రస్తుతం : 204.3520 టీఎంసీలు

    • కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

  • Jul 12, 2025 17:14 IST

    విశాఖ: ఆగస్టు 8 నుంచి ఏపీఎల్ సీజన్-4 మ్యాచ్ లు: ఏసీఏ సెక్రటరీ సతీష్

    • 14న ప్లేయర్స్ ఆక్షన్ నిర్వహిస్తున్నాం

    • మొత్తం 25 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నాం: ఏసీఏ సెక్రటరీ సతీష్

    • మాచ్‌లన్నీ విశాఖ వేదికగా జరుగుతాయి

    • వచ్చే సీజన్‌లో మరిన్ని వేదికలలో మ్యాచ్‌లు నిర్వహిస్తాం: ఏసీఏ సెక్రటరీ సతీష్

  • Jul 12, 2025 17:12 IST

    చిత్తూరు: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌కు మంత్రి గొట్టిపాటి పరామర్శ

    • వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన ఫొటో గ్రాఫర్ శివకుమార్

    • శివకుమార్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి

    • శివకుమార్‌కు అండగా ఉంటామని గొట్టిపాటి భరోసా

    • శివకుమార్‌పై దాడి చేసిన వారిని వదిలిపెట్టం: మంత్రి గొట్టిపాటి

  • Jul 12, 2025 16:05 IST

    తిరుమలలో ముగిసిన టీటీడీ, దేవదాయశాఖ సమావేశం

    • సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వెల్లడించిన మంత్రి ఆనం

    • టీటీడీ చైర్మన్‌, ఈవో, ఇతర అధికారులతో కలిసి సమీక్ష చేశాం: ఆనం

    • గతంలో సీఎం సమీక్షలో ఆలయాలకు చెందిన కొన్ని సమస్యలు వచ్చాయి

    • ఆయా సమస్యలపై చర్చించి రావాలని సీఎం ఆదేశించారు: ఆనం

    • 9 శాతం కామన్‌గుడ్‌ ఫండ్‌ టీటీడీ తీసుకోవాలని నిబంధనలు: ఆనం

    • గతంలో 5 శాతం ఉన్న దాన్ని 9 శాతానికి పెంచాం: ఆనం

  • Jul 12, 2025 15:44 IST

    కృష్ణా: గుడివాడలో ఫ్లెక్సీ కలకలం..

    • కొడాలి నాని, చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లు ఫ్లెక్సీ ఏర్పాటు.

    • కుప్పంలో చంద్రబాబు గెలిస్తే...బూట్ పాలిష్ చేస్తానన్న వ్యాఖ్యలు నిలిబెట్టుకోవాలని ఫ్లెక్సీ.

  • Jul 12, 2025 12:37 IST

    కోల్‌కతాలో మరో అత్యాచార ఘటన

    • IIM కోల్‌కతా బాయ్స్‌ హాస్టల్‌లో విద్యార్థినిపై అత్యాచారం

    • IIM విద్యార్థినిపై అక్కడే చదువుతున్న విద్యార్థి అత్యాచారం

    • బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

    • కౌన్సెలింగ్‌ పేరుతో తనకు కూల్‌డ్రింక్ తాగించి అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు

  • Jul 12, 2025 09:29 IST

    లిక్కర్ కేసులో నేడు సిట్ ముందుకు విజయసాయిరెడ్డి

    • సిట్ నోటీసులతో రెండోసారి సిట్‌ ముందుకు విజయసాయి

    • విజయవాడ సిట్ ఆఫీస్‌లో విజయసాయి విచారణ

    • గత ఏప్రిల్‌ 18న విజయసాయిని విచారించిన సిట్‌

    • విజయసాయి సమాచారంతో కదిలిన లిక్కర్ కేసు విచారణ

    • తాను విజిల్‌ బ్లోయర్‌నని చెప్పుకున్న విజయసాయి

    • లిక్కర్ స్కాంలో తనకు తెలిసినవన్నీ చెబుతానన్న విజయసాయి

    • లిక్కర్ కేసులో A-5 విజయసాయిరెడ్డి

    • విజయసాయి సిట్ విచారణతో వైసీపీ నేతల్లో భయం

  • Jul 12, 2025 09:29 IST

    కూకట్‌పల్లి కల్తీకల్లు ఘటనలో బాధితులకు కొనసాగుతుతో వైద్యం

    • నిమ్స్‌లో 33 మంది బాధితులకు చికిత్స

    • నిమ్స్‌లో చికిత్స పొందుతున్న 9మందికి కిడ్నీ సమస్యలు

    • మరో ఇద్దరు బాధితులకు కూడా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి

    • చికిత్స పొందుతున్న వారిలో 11 మంది నిలకడగా ఆరోగ్యం

    • ఇంకో 12 మందిని అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స

    • మరో 19మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స ఇప్పటివరకు కల్తీకల్లు ఘటనలో 9 మంది మృతి

    • ప్రధాన నిందితుడు సత్యంగౌడ్‌ను అరెస్టు చేసిన కూకట్‌పల్లి పోలీసులు

    • కూన సత్యం గౌడ్ అరెస్టుతో ఐదుకు చేరిన నిందితుల సంఖ్య

    • ఇప్పటికే కల్తీ కల్లు ఘటనలో బాలానగర్ ఎక్సైజ్ సీఐపై వేటు

    • మరికొంతమంది సిబ్బందిపై విచారణకు ఎక్సైజ్ శాఖ ఆదేశం

  • Jul 12, 2025 09:29 IST

    కొంపల్లి డ్రగ్స్‌ కేసుపై కొనసాగుతోన్న దర్యాప్తు

    • మరికొంతమందిని అరెస్ట్‌ చేయనున్న ఈగల్‌ టీం

    • మన్వాడ రెస్టారెంట్‌ ఓనర్‌ సూర్యతో పాటు ఆరుగురికి రిమాండ్‌

    • మరో 19 మందికి నోటీసులు ఇవ్వనున్న ఈగల్‌ టీం

    • పబ్‌ యజమానులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం

    • పరారీలో ఉన్న వారికోసం లుకౌట్‌ నోటీసులు జారీ చేయనున్న అధికారులు