Saraswati Pushkaralu 2025: సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - May 24 , 2025 | 03:49 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతి నది పుష్కరాలకు శనివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో భక్తులు పూజలు చేశారు. సరస్వతి నదిలో పుణ్యస్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. మే 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం చేస్తే కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతి నది పుష్కరాలకు శనివారం భక్తులు భారీగా తరలి వచ్చారు.

కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో భక్తులు పూజలు చేశారు.

సరస్వతి నదిలో పుణ్యస్నానం చేసి స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.

తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు సరస్వతి పుష్కరాలకు వస్తున్నారు.

మే 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం చేస్తే కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బంది రానీయకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడిపిస్తోంది.

సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాళేశ్వర క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది.
Updated at - May 24 , 2025 | 03:51 PM