Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాలకు భారీగా తరలి వస్తున్న భక్త జనం
ABN, Publish Date - May 16 , 2025 | 05:09 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజాము నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. శ్రీ మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఈ పుష్కరాలకు అంకురార్పణ చేశారు. గురువారం ఉదయం 5.44 గంటలకు ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగనున్నాయి. నదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజాము నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం అయ్యాయి.

శ్రీ మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఈ పుష్కరాలకు అంకురార్పణ చేశారు.

గురువారం ఉదయం 5.44 గంటలకు ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగనున్నాయి.

నదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.

ఈ పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరంలోని ముక్తీశ్వర క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

తెలంగాణ నలుమూలల నుంచి రోజుకు 40వేల నుంచి 50వేల మంది భక్తులు సరస్వతీ పుష్కరాలకు వస్తారని అధికారులు అంచనా వేశారు.

కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం కోసం క్యూలైనులో వేచి ఉన్న భక్తులు

భక్తుల పుణ్యస్నానాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జ్ఞాన సరస్వతి ఘాట్లలో అధికారులు వసతులు సిద్ధం చేశారు.

ఎండల తీవ్రత నేపథ్యంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.

పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 33 జిల్లాల నుంచి 220 ప్రత్యేక బస్సులు నడపుతోంది.

పుష్కరాల నేపథ్యంలో 1700 మంది పోలీసులు భద్రత విధుల్లో పాల్గొంటున్నారు.

త్రివేణి సంగమం వద్ద ప్రతిరోజు ఉదయం 8.30 నుంచి 11గంటల వరకు బ్రాహ్మణులు యాగాలు జరిపిస్తున్నారు.

త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న యువతులు

త్రివేణి సంగమంలో స్వామివారిని మొక్కుకుంటున్న భక్తులు

నందీశ్వర స్వామిని మొక్కుతున్న భక్తులు
Updated at - May 16 , 2025 | 05:22 PM