Share News

Donald Trump: కశ్మీర్ సమస్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. వెయ్యేళ్ల తర్వాత చూద్దామంటూ..

ABN , Publish Date - May 11 , 2025 | 11:03 AM

భారత్‌-పాక్ మధ్య యుద్ధం వాతావరణం ముదురుతున్న సమయంలో అమెరికా జోక్యంతో సర్దుమణిగింది. ఇండియా-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తమ దేశం మధ్యవర్తిత్వం వహించదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు . అయితే ఈ సందర్భంగా ఆయన కశ్మీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

Donald Trump: కశ్మీర్ సమస్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..  వెయ్యేళ్ల తర్వాత చూద్దామంటూ..

భారత్‌-పాక్ మధ్య యుద్ధం వాతావరణం ముదురుతున్న సమయంలో అమెరికా జోక్యంతో సర్దుమణిగింది. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తమ దేశం మధ్యవర్తిత్వం వహించదన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన కశ్మీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..


భారత్‌, పాకిస్తాన్ (India and Pakistan War) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) మీడియాతో మాట్లాడారు. భారత్, పాక్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందన్నారు. కాల్పులు విరమించకపోతే లక్షలాది మంది చనిపోయేవారని చెప్పారు. భారత్, పాక్ బలమైన నాయకత్వాల పట్ల తాను గర్వపడుతున్నట్లు తెలిపారు. కశ్మీర్ సమస్యకు (Kashmir issue) వెయ్యేళ్ల తర్వాత అయినా పరిష్కారం లభిస్తుందేమో, లేదే చూడాలన్నారు. అయితే కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో రెండు దేశాలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. అలాగే రెండు దేశాలతో వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకుంటామని తెలిపారు. చాలా మంది మరణానికి, విధ్వంసానికి దారితీసే ఈ యుద్ధాన్ని ఆపడం తెలివైన నిర్ణయమని చెబుతూ.. రెండు దేశాల నాయకులకూ ట్రంప్ తన కృతజ్ఞతలు తెలియజేశారు.


ట్రంప్ ప్రకటన తర్వాత.. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) మధ్యాహ్నం ఫోన్ చేసి, సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణకు అంగీకరించారని భారత అధికారులు తెలిపారు. అయితే దీనికి కొన్ని గంటల ముందు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్ పురా సెక్టార్లలో పాకిస్తాన్ వైపు నుండి భారీ షెల్లింగ్, డ్రోన్‌ల సంచారం కనిపించింది. దీంతో ఇండియన్ ఆర్మీ ఈ ప్రాంతంలో మొత్తం నాలుగు డ్రోన్‌లను కూల్చేసింది. ఈ ఘటనపై భారత ఆర్మీ అధికారులు మాట్లాడుతూ భారత్‌పై పాక్‌ అసత్యాలు ప్రచారం చేస్తోందని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని, అయితే భారత సైన్యం నిత్యం అప్రమత్తంగా ఉంటుందన్నారు. ఒకవేళ పాకిస్తాన్ దాడులకు తెగబడితే దీటుగా సమాధానమిస్తామని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇండియానే మొదట చొరవ చూపాలి: మెహబూబా ముఫ్తీ

భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..

భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 11 , 2025 | 11:08 AM