Trains: తెలుగు రాష్ట్రాల మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు.. అవి ఏయే స్టేషన్లలో ఆగుతాయంటే..
ABN , Publish Date - May 01 , 2025 | 01:05 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఆయా ప్రాంతాలకు వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఆ రైళ్లు నిర్ణిత స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ తెలిపింది.

చెన్నై: ప్రయాణికుల సౌకర్యార్ధం కోయంబత్తూర్-ధన్బాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకారం, నెం.06063 కోయంబత్తూర్-ధన్బాద్ ప్రత్యేక రైలు ఈ నెల 2,9,16,23 తేదీల్లో కోవైలో ఉదయం 11.50 గంటలకు బయల్దేరి మూడవరోజు ఉదయం 8.30 గంటలకు ధన్బాద్ చేరుకుంటుంది. మరుమార్గంలో నెం.06064 ధన్బాద్-కోయంబత్తూర్ ప్రత్యేక రైలు ఈ నెల 5,12,19,26 తేదీల్లో ధన్బాద్లో ఉదయం 6 గంటలకు బయల్దేరి మూడో రోజు వేకువజామున 3.45 గంటలకు కోయంబత్తూర్ చేరుకుంటుంది.ఈ రైళ్లు సేలం, జోలార్పేట, కాట్పాడి, పెరంబూర్, గూడూరు, నెల్లూరు(Gudur, Nellore), ఒంగోలు, విజయవాడ(Vijayawada) మీదుగా వెళ్లనున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Hero Vijay: అభిమానులకు హీరో విజయ్ సూచన.. విషయం ఏంటంటే..
- నెం.07435 కాచిగూడ-నాగర్కోయిల్(Kachiguda-Nagarkoyil) ప్రత్యేక రైలు ఈనెల 9,16,23,30, జూన్ 6వ తేదీల్లో కాచిగూడ(Kachiguda) నుంచి రాత్రి 7.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 10.30 గంటలకు నాగర్కోయిల్ చేరుకుంటుంది. మరుమార్గంలో నెం.07436 నాగర్కోయిల్-కాచిగూడ ప్రత్యేక రైలు ఈ నెల 11,18,25, జూన్ 1,8 తేదీల్లో నాగర్కోయిల్ నుంచి అర్ధరాత్రి 12.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 6.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్గాంధీ కుటుంబానికి ఆర్ఎస్ఎస్, బీజేపీలు బద్ధ శత్రువులే కదా
ఉద్యోగాల్లేకనే యువత డ్రగ్స్కు బానిసలు
Read Latest Telangana News and National News