Tungabhadra: తుంగభద్రకు భారీగా ఇన్ఫ్లో.. పెరుగుతున్న నీటిమట్టం
ABN , Publish Date - Jun 03 , 2025 | 01:51 PM
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్రలో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో డ్యాంలోకి వరద నీరు వస్తుండగా ప్రస్తుత నీటిమట్టం 18.86 టీఎంసీలుగా ఉంది. అలాగే.. ఇన్ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా ఉంది.

- ప్రస్తుత నీటిమట్టం 18.86 టీఎంసీలు..
- 20 వేల క్యూసెక్కులకుపైగా వస్తున్న వరదనీరు
బళ్లారి(బెంగళూరు): కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం(Tungabhadra Dam)లో నీటినిల్వ పెరుగుతూ వస్తోంది. సోమవారానికి 18.86 టీఎంసీలకు చేరింది. జలాశయం పరీవాహక ప్రాంతంలో వర్షాలు బారీగా కురుస్తుండడంతో ఇన్ఫ్లో భారీగా చేరుతోంది. సోమవారం 20 వేల క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో రావడంతో నీటి నిల్వ 18.86 టీఎంసీలకు చేరింది.
ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 1597.84 అడుగులుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి జలాశయ నీటిమట్టం 1577.47 అడుగులు ఉండగా.. 3.360 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. ఈ ఏడాది జలాశయా నికి ముందస్తుగా వరద వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
నా పేరు కవిత... నేనెప్పుడూ ప్రజలపక్షమే
రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి
Read Latest Telangana News and National News