Home » Ballari
తుంగభద్ర ఆయకట్టు క్రస్ట్గేట్లకు కాలం చెల్లడంతో జలాశయానికి సంబంధించి 32 గేట్లను మార్చాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో.. ఈ ఏడాది జలాశయంలో పూర్తి స్థాయిలో కాకుండా 80 టీఎంసీల నీరు నిలపాలని అధికారులు నిర్ణయించారు.
తుంగభద్ర ఆయకట్టు రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు. కాల్వల్లోకి నీరు రాకున్నా నారు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. నదీ జలాలు, బోర్లు, డ్యాం నీరు ఆధారంగా బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో 7లక్షల హెక్టార్ల ఆయకట్టు పైగా ఉంది.
బెంగళూరులో ఆర్సీబీ క్రికెట్ జట్టుకు సన్మాన కార్యక్రమంలో జరిగిన తొక్కిస లాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి శ్రీరాములు(Sri Ramulu) ధ్వజమెత్తారు.
తుంగభద్ర రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో నీరు పెద్దఎత్తున వస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 21.091 టీఎంసీల నీరు నిలువ ఉంది.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్రలో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో డ్యాంలోకి వరద నీరు వస్తుండగా ప్రస్తుత నీటిమట్టం 18.86 టీఎంసీలుగా ఉంది. అలాగే.. ఇన్ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా ఉంది.
తుండభద్ర రిజర్వాయర్ నీటి విడుదలపై అధికారులు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని రైతుసంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నీటి విడుదలపై అధికారులు ఇంకా ఏ ప్రకటన చేయకపోవడం వలన రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోందన్నారు.
‘తుంగభద్ర’పై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపించారు. ఈమేరకు ఆపార్టీ నాయకుల బృందం డ్యాంను సందర్శించింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డ్యాంను పట్టించుకోవడం లేదన్నారు.
వివసాయ మంత్రి అచ్చెన్నాయుడు బర్లీ పొగాకు రైతులకు అండగా ఉండి, ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పొగాకు కొనుగోళ్లలో న్యాయమైన ధరలు పెట్టి రైతుల హక్కులను రక్షిస్తామని చెప్పారు.
గాలి జనార్దన్రెడ్డిపై మా పోరాటం ఫలించింది.. అక్రమ మైనింగ్లో దోషులందరినీ శిక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. అలాగే.. నేను బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావాలకు వ్యతిరేకిని అని కూడా అన్నారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే..
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులకు సాగునీరందించే తుంగభద్ర రిజర్వాయర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల నేపధ్యంతో.. ఈ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తున్నారు.