Home » Bengaluru News
అప్పటివరకు మేం ఎంతో సంతోషంతో అక్కడి అందాలను తిలకిస్తున్నాం.. కానీ.. అంతలోనే ఆ కాల్పులు ఊహించలేదు.. భయపడుతూనే కశ్మీర్ నుంచి తిరిగి వచ్చాం అని కశ్మీర్ ఉగ్రదాడిని కళ్లారా చూసిన టీఎం రాజశేఖర్ అన్నారు. ఉగ్రదాడి నుంచి బయటపడి తన సొంతఊరైన బళ్లారికి చేరిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ వృద్ధాప్య సమస్యలతో బెంగళూరులో కన్నుమూశారు. ఆయన హైస్పీడ్ అంతరిక్ష ప్రయోగాలు, శాటిలైట్ అభివృద్ధికి చేసిన సేవలు అపూర్వమైనవిగా మిగిలాయి
మండలాల వ్యవస్థ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా.. కొందరు అధికారులు మాత్రం స్థానికంగా ఉండకుండా పట్టణాల నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీంతో పరిపాలన వ్యవస్థ గాడితప్పుతోంది. అంతేగాక ప్రజలకు ప్రభుత్వ సేవలు అందకుండా పోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రోజూ మూడు కప్పుల కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనని పలు ఆరోగ్య నివేదికలు తేల్చాయని, బ్లాక్ కాఫీ మరింత ఉత్తమమని స్పెషాలిటీ కాఫీ అసోసియేషన్ అధ్యక్షుడు పీఎం పూర్ణేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇండియా ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స చేశారు. దేవుడి పూజతో పాపాలు పోవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడనాట చర్చకు దారితీశాయి. తోటి మనిషిని ప్రేమించడమే మానవత్వం.. అంటూ ముఖ్యమంత్రి అన్నారు.
ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేసి.. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసిన ఈ ఘటనపై బీజేపీ నేతలు కూడా ఆరా తీస్తున్నారు. ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Bengaluru Auto Ride Language Controversy: బెంగళూరు వీధుల్లో ఓ ఆటో డ్రైవర్ విషయంలో జరిగిన తాజా వివాదం మరోసారి హిందీ భాషాధిపత్యాన్ని తెరమీదకు తెచ్చింది. 'బెంగళూరులో ఉండాలంటే హిందీలో మాట్లాడు' అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగడంతో సౌత్ ఇండియన్ భాషలు, సంస్కృతులపై హిందీ మాట్లాడే వారి ఆధిపత్య ధోరణిని బట్టబయలు చేసినట్లయింది.
కర్ణాటక రాష్ట్ర బంద్కు ఒక్కలిగ సంఘం సిద్దమవుతోంది. కులగణన నివేదికను వ్యతిరేకిస్తూ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చేందుకు నిర్ణయించింది. అలాగే.. ఒక్కలిగలకు అన్యాయం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. దీన్ని నిరసిస్తూ.. త్వరలో రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
బీజేపీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు సీటీ రవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈవీఎంలపై కాంగ్రెస్ నేతలు తరచూ విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాహుల్, ప్రియాంక అలానే గెలిచారా... అంటూ వ్యాఖ్యానించారు.
తల్లితో కలిసి తోటకెళ్లిన వారికి అదే చివరి రోజైన విషాద సంఘటన ఇది. వేసవి సెలవులు ఇవ్వడంతో ఇంట్లోనే ఉన్న వారు తల్లితో కలిసి తమ పొలం వద్దకు వెళ్లారు. అయితే.. అక్కడే ఉన్న వ్యవసాయ కుంటలో ప్రమాదవశాత్తూ పడిపోయి చనిపోయారు. దీంతో గ్రామంతో తీవ్ర విషాదం నెలకొంది.