Home » Bengaluru News
తుంగభద్ర ఆయకట్టు క్రస్ట్గేట్లకు కాలం చెల్లడంతో జలాశయానికి సంబంధించి 32 గేట్లను మార్చాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో.. ఈ ఏడాది జలాశయంలో పూర్తి స్థాయిలో కాకుండా 80 టీఎంసీల నీరు నిలపాలని అధికారులు నిర్ణయించారు.
వ్యవసాయశాఖకు అనుబంధమైన ఆహార సంస్కరణ విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి(Rohini Sindhuri)ని కార్మికశాఖ కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కర్ణాటక రాష్ట్రం కంప్లి తాలుకా పరిధిలోని సన్నాపురం గ్రామంలో బుధవారం నదిలో స్నానం చేస్తున్న యువకుడిపై మొసలి దాడి చేసింది. యువకుడు కేకలు వేయడంతో మొసలి నదిలోకి పరుగు తీసింది.
తుంగభద్ర ఆయకట్టు రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు. కాల్వల్లోకి నీరు రాకున్నా నారు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. నదీ జలాలు, బోర్లు, డ్యాం నీరు ఆధారంగా బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో 7లక్షల హెక్టార్ల ఆయకట్టు పైగా ఉంది.
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆగస్టు 15నుంచి ప్లాస్టిక్ కవర్ల నిషేధం సంపూర్ణంగా అమలు చేస్తామని దేవదాయశాఖ మంత్రి రామలింగారెడ్డి పేర్కొ న్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పశ్చిమకనుమలలో వర్షాలు ఆగడం లేదు. మలప్రభ నదికి ఇన్ఫ్లో పెరిగింది. దీంతో బెళగావి జిల్లా ఖానపుర తాలూకా కడకుంబి వద్ద నీరు పొంగిప్రవహిస్తోంది. కుసుమళి గ్రామం వద్ద నదికి అడ్డంగా బ్రిడ్మ్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. భారీగా నీరు రావడంతో ఇబ్బందికరం ఏర్పడింది. కొంతమేర రోడ్డు కొట్టుకుపోయింది.
భార్య ఎఫైర్ గురించి తెలిసిన ఓ భర్త ఆమె తలను నరికి చంపేశాడు. తలతో సహా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది.
బెంగళూరులో ఆర్సీబీ క్రికెట్ జట్టుకు సన్మాన కార్యక్రమంలో జరిగిన తొక్కిస లాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి శ్రీరాములు(Sri Ramulu) ధ్వజమెత్తారు.
సింగిల్ టీచర్ పాఠశాలలు పెరిగిపోవడంపై విద్యాశాఖ గగ్గోలు పెడుతోంది. సమీపంలోని పాఠశాలల్లోకి విలీనం చేసేందుకు స్థానికులు, ఉద్యమకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పలుచోట్ల వింత పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి.
బెంగళూరు నగర పరిసరాలలో 85 చిరుతలు ఉన్నట్లు పర్యావరణ నిపుణుడు డాక్టర్ సంజయ్గుబ్బి నేతృత్వంలోని హోళిమత్తె నేచర్ ఫౌండేషన్ బృందం అధ్యయనంలో గుర్తించింది. కెమెరా ట్రాప్ల ఆధారంగా ఏడాదిపాటు అధ్యయనం చేశారు.