Share News

Chennai: ఏం డౌట్ లేదు.. వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ ఓటమి తథ్యం..

ABN , Publish Date - May 24 , 2025 | 01:29 PM

మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి తథ్యం అని మాజీమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయ్‌కుమార్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యధిక స్థానాల్లో అన్నాడీఎంకే పార్టీ గెలవడం ఖాయమని ఆయన అన్నారు.

Chennai: ఏం డౌట్ లేదు.. వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ ఓటమి తథ్యం..

- మాజీ మంత్రి ఆర్బీ ఉదయ్‌కుమార్‌

చెన్నై: రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తథ్యమని అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఆర్బీ ఉదయ్‌కుమార్‌(RB Uday Kumar) జోస్యం చెప్పారు. రాష్ట్రంలో పెరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ తంజావూరులో శుక్రవారం నగర అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ ఆందోళనలో పాల్గొన్న ఉదయ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ... మూడేళ్లుగా రాష్ట్రాన్మి విమర్శిస్తున్నారంటూ ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ మహానాడులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పాల్గొనలేదని,


nani5.2.jpg

కానీ ప్రస్తుతం నీతి ఆయోగ్‌ మహానాడులో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీ వెళ్లారన్నారు. కేసుల నుంచి నిందితులను రక్షించేందుకే సీఎం ఢిల్లీ పర్యటన అని అనుమానం వస్తుందన్నారు. 2011 ఎన్నికల్లో నిరంతర విద్యుత్‌ కోతల సమస్య కారణంగాడీఎంకే అధికారం కోల్పోయిందన్నారు. కానీ, ప్రస్తుతం క్షీణిస్తున్న శాంతి భద్రతలు డీఎంకే ఓటమికి ప్రధాన కారణంగా ఉంటాయన్నారు.



ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..

Kaleshwaram: కాళేశ్వరంలో నవరత్న మాల హారతి!

Read Latest Telangana News and National News

Updated Date - May 24 , 2025 | 01:29 PM