Home » Tamil Nadu
డీఎంకే కూటమి తరఫున తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్హాసన్ చెన్నైలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కొందరు అభిమానులు వైదికపైకి వచ్చి కమల్ పట్ల తమ అభిమానం చాటుకున్నారు.
వచ్చే యేడాది శాసనసభ ఎన్నికల తర్వాత అన్బుమణిని పార్టీ అధ్యక్షుడిగా చేద్దామని నిర్ణయించానని, అయితే పార్టీలో 99 శాతం మంది దానిని వ్యతిరేకిస్తుండటంతో ఊపిరున్నంతవరకూ తానే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ ప్రకటించారు.
రాష్ట్రంలో పాఠశాల, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇస్తున్న కుల ధృవీకరణ పత్రాల్లో ‘హిందూ’ అనే పదాన్ని తొలగించడం సరికాదని బీజేపీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు, కోవై వెస్ట్ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు జాతీయ విపత్తుల బృందం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు.
వచ్చే యేడాది జరుగనున్న ఎన్నికల గురించి ప్రస్తావించవద్దని, తనను ‘యువనేత కామరాజర్’ అంటూ తనపై పొగడ్తల వర్షం కురిపించకూడదని తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత, సినీ నటుడు విజయ్ విద్యార్థులకు హితవు పలికారు.
విల్లుపురం జిల్లా తిరువెనైనల్లూరు సమీపంలోని మేల్దనియాళంపట్టు గ్రామంలో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో పల్లవరాజుల కాలంనాటి దేవతామూర్తుల శిల్పాలు లభ్యమయ్యాయి. ఈ గ్రామంలో విల్లుపురంకు చెందిన పురావస్తుశాఖ పరిశోధకులు సెంగుట్టువన్, తమిళలగన్ పర్యవేక్షణలో తవ్వకాలు కొనసాగుతున్నాయి.
ధర్మపురి జిల్లాలో ఓ తాగుబోతు చేసిన పనికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. జిల్లాలోని ఫోర్ రోడ్స్ సమీపంలో టాస్మాక్ మద్యం షాపు ఉండగా, ఓ యువకుడు మెడలో పాము వేసుకుని వచ్చాడు.
తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి ప్రభుత్వాస్పత్రి వెనుకనున్న ఖాళీ స్థలంలో నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు పారేశారు. వివరాల్లోకి వెళ్తే శుక్రవారం ఉదయం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రి వెనుక ఖాళీ స్థలం నుంచి పసిబిడ్డ ఏడుపు వినిపించడంతో అక్కడి స్థానికులు వెళ్ళిచూడగా, చెట్లపొదల్లో ఓ పసిబిడ్డ కనిపించింది.
ఢిల్లీ నుండి రాష్ట్రంపై పెత్తనం చెలాయించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. సేలంలోని మోహన్కుమారమంగళం ప్రభుత్వ వైద్యకళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో రూ.880 కోట్లతో నిర్మించనున్న జౌళి పార్కుకు, రూ.100 కోట్లతో నిర్మించనున్న కొత్త గ్రంథాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.
‘మా అందరి కులదైవం మీరే అని పొగడుతూనే నా గుండెల్లో గునపాలు దించుతున్నారు. అన్నింటికీ మా అయ్యగారేనని చెబుతూ నన్ను అధఃపాతాళంలోకి తొక్కేస్తున్నారు. అడుగడుగునా అవమానిస్తున్నారు. ఒంటరిని చేసి, మూలన కూర్చోబెట్టాలని కుట్ర పన్నుతున్నారు’ అంటూ పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ తన కుమారుడైన పీఎంకే అధ్యక్షుడు అన్బుమణిపై నిప్పులు చెరిగారు.