Home » Chennai News
ఓ మహిళను చంపేసిన పులి ఎట్టకేలకు చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నీలగిరి జిల్లాలో గత నెల 24వ తేది పులి మహిళపై దాడిచేసి చంపేసింది. కాగా.. ఆ పులిని బంధించేందుకు అటవీ అధికారులు ప్రయత్నించి ఎట్టకేలకు దానిని బంధించడంతో ఈ ఏరియా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు తేదీ దగ్గర పడుతున్నాకొద్దీ రాష్ట్రంలో రాజకీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయాలా... లేక కూటమిలో చేరాలా అన్నదానిపై నిర్ణయాధికారం విజయ్దేనని టీవీకే పార్టీ నేతలు తెలిపారు. ఈమేరకు టీవీకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో.. అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్కి అతని సన్నిహితుడు, ఇప్పటివరకు ఆయన వెన్నంటి ఉన్న పీటీ సెల్వకుమార్ ఝలక్ ఇచ్చారు. ఆయన టీవీకేని వదిలి డీఎంకే పార్టీలో చేరారు.
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవి చెళియన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కావాలనుకుంటున్న విజయ్ కల ఫలించదు.. అంటూ ఆయన పేర్కొన్నారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అది కలగానే మిగిలిపోతుందే తప్ప నిజం కాదంటూ ఆయన అన్నారు.
టీవీకే నేతపై ఎస్పీ ఈషా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ 41 మందిని పొట్టనబెట్టుకున్నారు.. ఇక్కడా అవే వేషాలా?.. అనుమతి మేరకు నడుచుకోండి. సభకు భద్రత కల్పించడమెలాగో నాకు తెలుసు. మీలాంటి వారి సలహాలు నాకు అక్కర్లేదు. జాగ్రత్తగా మసలుకోండి.. అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనానికి దారితీశాయి.
డీఎంకే నేతల మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవదు.. మోసపోవద్దు.. అని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ అన్నారు. పుదుచ్చేరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మోసపూరిత హామీలతో వస్తుంటారని, కానీ ఓటర్లు నమ్మవద్దన్నారు.
చెన్నై నగర శివారు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. దిత్వా తుపాన్ నగరాన్ని ముంచెత్తింది. అయితే... ప్రస్తుతం తుపాన్ ప్రభావం లేకున్నా ఎక్కడ చూసినా బురద, చెత్తాచెదారం, దర్శనమిస్తోంది.
తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణం చతికి గజగజ వణికిపోతోంది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు చలితో ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. అలాగే మంచుకూడా విపరీతంగా పడుతోంది. నిన్న 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాజధాని నగరం చెన్నైలో 15 లక్షల ఓట్లు తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఓట్ల తొలగింపు అంశం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
పెంచుకుంటున్న ఆవు మృతి చెందడంతో.. తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలో చోటుచేసుకుంది. సెంథిల్కుమార్ అనే విద్యార్థి కుటుంబం ఆవును పెంచుకుంటోంది. అయితే... రెండురోజుల క్రితం అతి మృతిచెందడం.. అతడ్ని బాగా దాగాలుకు గురిచేసింది. అనంతరం అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.