Home » Chennai News
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఇది. తమ కుటుంబ పరిస్థితి బాగోలేరున్నా భర్త కొద్ది రోజులుగా మద్యాన్ని సేవిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనికి మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆ చేపలను తినడం ఏమోగాని తాకితేనే వివిధ చర్మ వ్యాధులు వస్తున్నాయట. రామేశ్వరం సమీపం పాక్ జలసంధి ప్రాంతం వద్ద జెల్లీ చేపలు తీరానికి కొట్టుకురావటంతో జాలర్లు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ చేపలను తినడం సంగతి అటుంచితే కనీసం తాకితేనే వివిధ చర్మవ్యాధులు వస్తున్నాయని పలువురు తెలుపుతున్నారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. అలాగే.. రాష్ట్రంలో మత ఉగ్రవాదాన్ని సహించబోమని కూడా పేర్కొన్నారు. శాసనసభలో సీఎం మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరుతో ఓ కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటుకానుంది. ఈ మేరకు ఈ వర్సిటీకి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ వర్సిటీ పరిధిలోకి 17 కళాశాలలు వస్తాయి.
రానురాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయనడానికి ఈ సంఘటనే ఓ ఉదహారణ. నవమాసాలు మోసి, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డనే తన ‘ఆ’ కార్యకలాపాలకు అడ్డొస్తోందని భావించి మద్యం తాగించి చితకబాదారు. ఆ దెబ్బలకు తాళలేక ఆ చిన్నారి మృతిచెందింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆయా పట్టణాలకు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తూ.. రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. కాచిగూడ, సికింద్రాబాద్, నరసాపురంలకు ఈ రైళ్లను నడపనున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
ఊటీ కొండరైలును అధికారులు అద్దెకిచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులకు అద్దెకివ్వడం ద్వారా సంస్థకు ఆర్ధికంగా లాభం కూడా చేకూరుతోంది. ఓ పాఠశాల విద్యార్థులకు రూ.4.98 లక్షలతో కొండ రైలును అద్దెకిచ్చారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్లో జరిగిన హత్య, దోపిడీ కేసు విచారణకు సయాన్ హాజరయ్యారు. నీలగిరి జిల్లాలో జయలలితకు చెందిన అత్యంత ఖరీదైన ‘కొడనాడు ఎస్టేట్’ ఉంది. దీంట్లోనే జయలలితకు చెందిన బంగారం నగలు, భూముల పత్రాలు, ఇతరత్రా ఆసంతులకు సంబంధించిన పత్రాలు ఉండేవని సమాచారం.
రాష్ట్ర మంత్రి ఒకరికి హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఆయనపై నమోదైన కేసును మళ్ళీ విచారించాలని ఆదేశాలివ్వడంతో మంత్రి చిక్కుల్లో పడ్డట్లయింది. డీఎంకే సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి దురైమురుగన్కు మద్రాస్ హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఆయనపై నమోదైన కేసులను మళ్ళీ విచారించాలని ఆదేశించింది. దీంతో మంత్రి కాస్త చిక్కుల్లో పడ్డట్లయింది.
రాష్ట్ర మంత్రి ఒకరు చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అటు ప్రభుత్వానికి, ఇటు మంత్రికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. రాష్టప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని పలు పార్టీలు, సంస్థలు డిమాండ్ మొదలుపెట్టాయి.