Gold Robbery: బంగారం స్మగ్లింగ్లో వీరి తెలివితేటలకు షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Feb 06 , 2025 | 12:00 PM
Gold Robbery: ఢిల్లీ ఎయిర్ పోర్టులో అనుమానాస్పందగా తిరుగుతున్న ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వారి దగ్గరి నుంచి బారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ఇవాళ (గురువారం) తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో విమానాశ్రయంలో అనుమానాస్పందగా తిరుగుతున్న ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారించారు. అధికారుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇటలీలోని మిలాన్ నుంచి ఇద్దరు ప్రయాణికులు ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. ఇద్దరు ప్రయాణికులను పరిశీలించగా 10 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తొలుతగా వారు తీసుకువచ్చిన బ్యాగులను స్కాన్ చేశారు. ఇందులో ఏం కనిపించలేదు. ఆ తర్వాత ప్రయాణికులను అధికారులు పరిశీలించారు. ప్రత్యేకంగా తయారు చేసిన బెల్ట్లను అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి రూ. 5 కిలోల బంగారు నాణేలు బయటపడ్డాయి.
ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా వీటిని మన దేశంలోకి తీసుకువచ్చినట్లు విచారణలో వెల్లడైంది. వారిద్దరి నుంచి మొత్తంగా 10.092 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7.8 కోట్ల పైనే ఉంటుందని అంచనా వేశారు. బంగారు నాణేలతో పట్టబడిన దొంగలు కశ్మీర్ ప్రాంత వాసులుగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. మరింత సమాచారం కోసం వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.