BJP: ‘తుంగభద్ర’పై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం..
ABN , Publish Date - May 28 , 2025 | 01:03 PM
‘తుంగభద్ర’పై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపించారు. ఈమేరకు ఆపార్టీ నాయకుల బృందం డ్యాంను సందర్శించింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డ్యాంను పట్టించుకోవడం లేదన్నారు.

- గేట్ల ఏర్పాటుపై చర్యలు తీసుకోని ప్రభుత్వం
- టెండర్ల ప్రక్రియలోనూ అడ్డంకులే: బీజేపీ
బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర డ్యాం(Tungabhadra Dam)కు గతేడాది కొట్టుకుపోయిన 19వ క్రస్ట్ గేటు స్థానంలో కొత్త గేటును అమర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిందని బీజేపీ(BJP) నాయకులు ఆరోపించారు. టీబీడ్యాంపై కొప్పళ జిల్లా బీజేపీ బృందం బుధవారం పర్యటించింది. ప్రతిపక్ష నాయకుడు దొడ్నగౌడ పాటిల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బసవరాజ్ కావటూర్, రమేష్, గణేష్, మంజునాథ్, మల్లికార్జున తదితర నాయకులు బృందంలో ఉన్నారు.
దెబ్బతిన్న 19వ క్రస్ట్ గేటు స్థానంలో కొత్త గేటు అమర్చేందుకు రూ.2 కోట్ల వ్యయంతో టెండర్ పిలిచారని, కానీ మళ్లీ రద్దు చేశారన్నారు. ఇక మిగిలిన గేట్లకు ఎప్పుడు టెండర్ పిలుస్తారో.. ఎప్పుడు మరమ్మత్తుచేస్తారో ఆయోమయంగా ఉందని మండిపడ్డారు. డ్యాంకు నీరు వస్తున్న తరుణంలో గేట్లు పటిష్టంగా లేకుంటే నీరు ఎలా నిలుస్తాయని ప్రశ్నించారు. ఇది పూర్తీగా సర్కార్ వైఫల్యమేనన్నారు. పలువురు బీజేపీ నాయకులు డ్యాంను పరిశీలించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: గుడ్ న్యూస్..వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు..
Miss World 2025: మిస్ వరల్డ్ ఫైనల్స్... 3 గంటలు.. 3500 మంది ప్రేక్షకులు
Read Latest Telangana News and National News