Fake Notes: 500 నోట్లతో జాగ్రత్త

ABN , First Publish Date - 2025-04-22T05:30:50+05:30 IST

కేంద్ర హోం శాఖ హెచ్చరిక: నకిలీ 500 రూపాయల నోట్లను నేర ముఠాలు తయారు చేశాయి. ఈ నోట్లలో స్పెల్లింగ్‌ దోషం ఉన్నట్లు వెల్లడించింది. అసలు నోట్లపై "RESERVE BANK OF INDIA" అనే పదం ఉండగా, నకిలీ నోట్లపై "RESERVE BANK OF INDIA" లోని 'E' కు బదులుగా 'A' ఉంది. ప్రజలు, ఆర్థిక సంస్థలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది

Fake Notes: 500 నోట్లతో జాగ్రత్త

  • స్పెల్లింగ్‌ దోషంతో మార్కెట్లోకి నకిలీ నోట్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి నేర ముఠాలు తయారు చేసిన నకిలీ 500 రూపాయల నోట్లు మార్కెట్లోకి వచ్చాయని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. దాదాపుగా అసలు నోట్లను పోలి ఉన్న నకిలీ నోట్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నాణ్యత, ముద్రణపరంగా ఒరిజనల్‌ నోట్లను పోలి ఉన్నాయని, చాలా పరీక్షగా గమనిస్తే తప్ప తేడా తెలియని విధంగా నకిలీ నోట్లు ఉన్నాయని పేర్కొంది. అసలు నోట్లకు, నకిలీ నోట్లకు మధ్య చిన్న స్పెల్లింగ్‌ దోషం మాత్రమే తేడా ఉందని, నకిలీ నోట్లను గుర్తించడంలో ఇదే కీలకమని వెల్లడించింది. కరెన్సీ నోట్లపై RESERVE BANK OF INDIA అని ఉంటుందని, అయితే నకిలీ 500 రూపాయల నోట్లపై RESERVE అనే పదంలో E కి బదులుగా A అని ఉంటుందని.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ స్పష్టంగా పరిశీలించాలని అప్రమత్తం చేసింది. ఈ సూక్ష్మమైన తేడాను నిశితంగా పరిశీలించకపోతే నకిలీ నోట్లను గుర్తించడం కష్టమని, ఇవి అత్యంత ప్రమాదకరమైనవని ఓ సీనియర్‌ అధికారి అన్నారు. నకిలీ నోట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, సంబంధిత సంస్థలను అలర్ట్‌ చేసినట్టు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఇప్పటికే పెద్ద మొత్తంలో మార్కెట్‌లోకి వచ్చి ఉండొచ్చని పేర్కొంది.

Updated Date - 2025-04-22T05:30:51+05:30 IST