Home » Reserve Bank of India
ఆర్బీఐ తాజా నిర్ణయాలతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ రెచ్చిపోయాయి. ఇవాళ ఒక్క రోజులో 3.5 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద పెరిగింది. ఇక, ఆర్బీఐ తాజా నిర్ణయాలు 9.5లక్షల కోట్ల డబ్బు వ్యవస్థలోకి తీసుకువచ్చాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. నగల తాకట్టుపై ఆర్బీఐ నిబంధనలు తొలగించాలని కోరుతూ.. ఆయన ఈ లేఖ రాశారు. నగల తాకట్టుకు కఠిన నిబంధనలు అమలు చేయడం భావ్యమేనా అని ఆయన ప్రశ్నించారు.
రూ. 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ఇవ్వబోతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ మొత్తాన్ని డివిడెండ్గా చెల్లించబోతోంది ఆర్బీఐ. దీంతో ఇక, సొమ్ములే సొమ్ములన్నమాట.
కేంద్ర హోం శాఖ హెచ్చరిక: నకిలీ 500 రూపాయల నోట్లను నేర ముఠాలు తయారు చేశాయి. ఈ నోట్లలో స్పెల్లింగ్ దోషం ఉన్నట్లు వెల్లడించింది. అసలు నోట్లపై "RESERVE BANK OF INDIA" అనే పదం ఉండగా, నకిలీ నోట్లపై "RESERVE BANK OF INDIA" లోని 'E' కు బదులుగా 'A' ఉంది. ప్రజలు, ఆర్థిక సంస్థలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉన్న కొత్త రూ.100, రూ.200 కరెన్సీ నోట్లను త్వరలో విడుదల చేస్తామని భారతీయ రిజర్వ్ బ్యాంకు తాజాగా పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3000 కోట్ల అప్పు తీసుకున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది.
నోట్లు ఇచ్చి నాణేలు తీసుకోవడానికి సాధారణంగా కొంత కమిషన్ తీసుకుంటారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలకు చిల్లర చాలా అవసరం. ఒక్క రూపాయి అదనంగా చెల్లించకుండా ఉచితంగా నాణేలు ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రైతులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తనఖా రహిత వ్యవసాయ రుణాల పరిమితిని ప్రస్తుత రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్టు పేర్కొంది.
దేశంలో కొన్ని రోజుల క్రితం రైల్వే స్టేషన్, స్కూల్స్, పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతోపాటు ఇటివల ఎయిర్ పోర్టులకు ఇలాంటి కాల్స్ వస్తే అనేక విమాన సర్వీసులు ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తాజాగా మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లష్కరే తోయిబా అంటూ ఫోన్ వచ్చింది.
గూగుల్పే, ఫోన్పేలాంటి యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సిందే! మరి బ్యాంకు ఖాతాలు లేనివారి పరిస్థితి?