CM Stalin: నగల తాకట్టుపై ఆర్బీఐ నిబంధనలు తొలగించండి
ABN , Publish Date - May 29 , 2025 | 11:21 AM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. నగల తాకట్టుపై ఆర్బీఐ నిబంధనలు తొలగించాలని కోరుతూ.. ఆయన ఈ లేఖ రాశారు. నగల తాకట్టుకు కఠిన నిబంధనలు అమలు చేయడం భావ్యమేనా అని ఆయన ప్రశ్నించారు.

- కేంద్ర మంత్రికి సీఎం స్టాలిన్ లేఖ
చెన్నై: బంగారు నగల తాకట్టుకు రిజర్వు బ్యాంక్ కఠిన నిబంధనలు అమలు చేయడం వల్ల రైతులు, కోళ్ళఫారం యజమానులు, మత్స్యపరిశ్రమల నిర్వాహకులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, ఆ నిబంధనలు తొలగించేలా ఉత్తర్వు జారీ చేయాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) లేఖ రాశారు. నగల తాకట్టుపై నిబంధనలు విధించడంతో రాష్ట్రంలోని రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోందని,
స్వల్పకాలిక పంటలు వేయడం కోసం రైతులు నగలను తాకట్టుపెట్టి రుణం పొందటం ఆనవాయితీ అని, అయితే నగల తాకట్టుపై కఠిన నిబంధనలు విధిస్తే తమ నగల విలువకు సరిపడా రుణం పొందలేకపోతారని ఆయన పేర్కొన్నారు. నగల తాకట్టుకు కఠిన నిబంధనలు అమలు చేయడం భావ్యమేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకుని ఆర్బీఐ నిబంధనలు ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Dog Attack: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన పిచ్చికుక్క
Read Latest Telangana News and National News