Share News

Stock Markets: బ్లాక్‌బస్టర్ ఫ్రైడే.. ఆర్బీఐ ఎఫెక్ట్, ఒక్క రోజులో 3.5 లక్షల కోట్లకు పైగా లాభం

ABN , Publish Date - Jun 06 , 2025 | 05:44 PM

ఆర్బీఐ తాజా నిర్ణయాలతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ రెచ్చిపోయాయి. ఇవాళ ఒక్క రోజులో 3.5 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద పెరిగింది. ఇక, ఆర్బీఐ తాజా నిర్ణయాలు 9.5లక్షల కోట్ల డబ్బు వ్యవస్థలోకి తీసుకువచ్చాయి.

Stock Markets:  బ్లాక్‌బస్టర్ ఫ్రైడే.. ఆర్బీఐ ఎఫెక్ట్, ఒక్క రోజులో 3.5 లక్షల కోట్లకు పైగా లాభం
Blockbuster Friday as RBI rate cut

ఇంటర్నెట్ డెస్క్: ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు (Stock Markets) బ్లాక్‌బస్టర్ ఫ్రైడే(Friday Market)ని చవిచూశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( RBI) రెపో రేటు తగ్గింపుతో నిఫ్టీ 25,000 మార్క్ దాటింది. బ్యాంక్ నిఫ్టీ అయితే, ఏకంగా రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊహించిన దానికంటే ఎక్కువ రెపో రేటు తగ్గింపుతో పాటు నగదు నిల్వ నిష్పత్తి (CRR) Cash Reserve Ratio తగ్గింపుతో ఇవాళ (జూన్ 6)న భారత బెంచ్‌మార్క్ సూచీలు మూడవ సెషన్‌లోనూ లాభాలు మూటగట్టుకున్నాయి. ఇక, నిఫ్టీ మూడు వారాల్లో ఉత్తమ ట్రేడ్ డే ను నమోదు చేసింది.

శుక్రవారం వారాంతంలో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 746.95 పాయింట్లు లేదా 0.92 శాతం పెరిగి 82,188.99 వద్ద ఉంది. నిఫ్టీ 252.15 పాయింట్లు లేదా 1.02 శాతం పెరిగి 25,003.05 వద్ద ఉంది. ఇక, నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.2 శాతం పెరగగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం పెరిగాయి. ఇక, బిఎస్‌ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్నటి రూ. 447.5 లక్షల కోట్ల నుండి రూ.451 లక్షల కోట్లకు పెరగడంతో పెట్టుబడిదారుల సంపద ఒక్కరోజులో రూ. 3.5 లక్షల కోట్లకు పైగా పెరిగింది.

ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించాలనే నిర్ణయం EMIలను తగ్గిస్తుందని అంచనా వేయడం, హోం లోన్స్‌ ఇచ్చే బ్యాంకు షేర్లకు ఊతం వచ్చింది. దీంతో బ్యాంకింగ్ స్టాక్స్ తోపాటు రియాల్టీ ఇండెక్స్ 4 శాతం పెరిగింది. దీంతోపాటు, బంగారు రుణాలకు సంబంధించి లోన్-టు-వాల్యూ నిష్పత్తి పరిమితిని 85%కి పెంచుతామని ఆర్‌బిఐ చెప్పడంతో గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీల షేర్లు 5 నుంచి 7 శాతం వరకూ పెరిగాయి.


ఆర్బీఐ తాజా నిర్ణయం.. బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.2.5 లక్షల కోట్ల లిక్విడిటీని ఇంజెక్ట్ చేయడానికి దోహదపడింది. ఆర్బీఐ.. CRRని దశలవారీగా 100 బేసిస్ పాయింట్లు తగ్గించి 3%కి తీసుకురావడంతో ఇది సాధ్యమైంది. తద్వారా బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు పెరిగి మరిన్ని రుణాలిచ్చేందుకు వీలవుతుంది. ఫలితంగా మార్కెట్లోకి మనీ మరింతగా వస్తుంది. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ ఆర్బీఐ 9.5లక్షల కోట్ల డబ్బును వ్యవస్థలోకి తీసుకువచ్చింది.

ఆర్బీఐ తాజా నిర్ణయాలతో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.5 శాతం పెరిగి కొత్త రికార్డు గరిష్ట స్థాయి 56,695కి చేరుకుంది. ఆటో, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌లు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు, మీడియా ఇండెక్స్ 1 శాతం తగ్గింది.

నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన వాటిలో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి ఉన్నాయి. అయితే హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా స్టీల్, భారతి ఎయిర్‌టెల్, సన్ ఫార్మా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

ఇవాళ బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE)లో 110 కంటే ఎక్కువ స్టాక్‌లు వాటి 52 వారాల గరిష్ట స్థాయిలను తాకాయి. వీటిలో గోద్రేజ్ ఇండస్ట్రీస్, ముత్తూట్ ఫైనాన్స్, బజాజ్ హోల్డింగ్స్, మణప్పురం ఫైనాన్స్, SBI కార్డ్స్, మహారాష్ట్ర స్కూటర్స్, MCX ఇండియా, AU స్మాల్ ఫైనాన్స్, HDFC AMC, HDFC బ్యాంక్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, SRF, APL అపోలో, వెల్‌స్పన్ కార్ప్, అబాట్ ఇండియా, అనుపమ్ రసాయన్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆస్ట్రాజెనెకా ఫార్మా, సోలార్ ఇండస్ట్రీస్, లాయిడ్స్ మెటల్స్, మొదలైన స్టాక్స్ ఉన్నాయి.


ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 06 , 2025 | 06:13 PM