Home » Stock Market
స్టాక్ మార్కెట్ అనేది ఓ సముద్రం లాంటిది. ఎప్పుడు ఎలాంటి కెరటం వస్తుందో ముందుగా ఊహించడం చాలా కష్టం. నేడు పడిపోయిన స్టాక్, రేపు మళ్లీ పుంజుకోవచ్చు. కానీ కొన్ని స్టాక్స్ మాత్రం తక్కువ సమయంలోనే భారీగా పెరుగుతాయి. ఇక్కడ కూడా ఓ స్టాక్ (Multibagger Stocks) విషయంలో అచ్చం అలాగే జరిగింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఐపీఓల పండుగ వచ్చింది. జూన్ 16 నుంచి ప్రారంభమయ్యే వారంలో (Next Week IPOs) మార్కెట్ చాలా చురుగ్గా కొనసాగనుంది. ఎందుకంటే ఈసారి కొత్తగా ఆరు ఐపీఓలతోపాటు మరో ఐదు కంపెనీలు కూడా మార్కెట్లోకి రానున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
విదేశీ మదుపర్లు పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటుండడంతో దేశీయ సూచీలు గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్నాయి. మంగళవారం కూడా విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.2302 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత మూడు రోజులుగా వారు షేర్ల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.
ఇండియాలో జరిగిన విమాన ప్రమాదం, అమెరికాలో బోయింగ్ షేర్ల పతనానికి (Boeing Shares Crash) దారి తీసింది. దీంతోపాటు భారతీయ స్టాక్ మార్కెట్ కూడా గురువారం భారీ నష్టాలతో ముగిసింది. అయితే ఈ ప్రమాదానికి, మార్కెట్ పడిపోవడానికి గల కారణాలేంటోనేది ఇక్కడ తెలుసుకుందాం.
విదేశీ మదుపర్లు పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటుండడంతో దేశీయ సూచీలు గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్నాయి. మంగళవారం కూడా విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.2302 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత మూడు రోజులుగా వారు షేర్ల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.
సోమవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం కాస్త ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల కారణంగా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను అరశాతం మేర తగ్గించడం, నగదు నిల్వల నిష్పత్తిలో కోత విధించడం కాస్తా కలిసి వచ్చింది.
అంచనాలకు మించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను అరశాతం మేర తగ్గించడం దేశీయ సూచీలకు బూస్ట్ ఇచ్చింది. అలాగే అంతర్జాతీయ పరిణామాలు, నగదు నిల్వల నిష్పత్తిలో ఆర్బీఐ కోత విధించడం కూడా మార్కెట్లకు కలిసివస్తోంది. ఈ పరిణామాల కారణంగా మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయింది.
స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్ ఎప్పుడు పుంజుకుంటుందో (Stock Market Success) వెంటనే అంచనా వేయలేం. కానీ పలు కంపెనీల పెన్నీ స్టాక్స్ (Penny Stock) మాత్రం తక్కువ సమయంలోనే ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తాయి. ఇప్పుడు కూడా మరో పెన్నీ స్టాక్ పెట్టుబడి దారులకు రెండేళ్లలోనే 32000 వేల శాతానికిపైగా లాభాలను అందించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత్ స్టాక్ మార్కెట్లో ఈరోజు (జూన్ 9, 2025న) బుల్ జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగం మార్కెట్లలో సంచలనం సృష్టించింది. దీంతో బ్యాంక్ నిఫ్టీ (Bank Nifty Record) సూచీ సరికొత్త గరిష్టాన్ని తాకి మరో స్థాయికి చేరుకుంది.
బంగారు నగల వ్యాపార సంస్థ లలితా జువెలర్స్ ఐపీవో కి రాబోతోంది. తొలి పబ్లిక్ ఆఫర్ ద్వారా దాదాపు రూ.1700 కోట్లు సమీకరించాలనుకుంటోంది. ప్రమోటర్ అయిన కిరణ్ కుమార్ జైన్ రూ.500 కోట్ల విలువైన తన షేర్లు విక్రయించాలని తలపెట్టారు.