Home » Stock Market
అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరే పరిస్థితులు కనిపిస్తుండడం, ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడడం, అంతర్జాతీయంగా సానుకూలాంశాలు మార్కెట్లను ముందుక నడిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి.
డాలర్తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనమవడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో సూచీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ ఓ మోస్తరు లాభాల్లో కదలాడుతున్నాయి.
డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం వల్ల బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 11న) ఉదయం 6.30 గంటల సమయానికి దేశంలోని పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
వెండి రికార్డు గరిష్టాలకు చేరుకుంది. ఈ రోజు వెండి కిలోకు ఏకంగా 9000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ఏకంగా రూ. 2, 07, 000కు చేరుకుంది. అనుకున్నట్టుగానే రెండు లక్షలు దాటేసింది. మరోవైపు బంగారం కూడా మరింత పెరిగింది.
ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. మొదటి రోజున ఐపీఓ ధరతో పోల్చుకుంటే 46 శాతం ప్రీమియంతో లిస్ట్ అయి లాభాలను పంచింది. గత కొన్ని సెషన్లుగా వరుసగా నష్టపోతున్న దేశీయ సూచీలు బుధవారం కోలుకున్నాయి.
మంగళవారం ఉదయంతో పోల్చుకుంటే బుధవారం ఉదయం బంగారం ధర గ్రాముకు వెయ్యి రూపాయిల మేర తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 10న) ఉదయం 6.30 గంటల సమయానికి దేశంలోని పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యం వంటి పలు వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు విధించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు రావడంతో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంపై బుధవారం సమావేశం కానుంది.
గత కొన్ని రోజుల్లో ఇండిగోకు చెందిన వందల కొద్దీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. డీజీసీఏ నూతన ఎఫ్డీటీఎల్ నిబంధనలకు అనుగుణంగా సిద్ధం కావడంలో ఇండిగో వైఫల్యం చెందడంతో ఆ సంస్థ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆ ప్రభావం ఆ కంపెనీ షేర్లపై కూడా స్పష్టంగా కనబడుతోంది
డాలర్తో పోల్చుకుంటే రూపాయి రోజు రోజుకూ క్షీణిస్తుండడంతో దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. రూపాయి క్షీణిస్తుండడం స్టాక్ మార్కెట్లపై నెగిటివ్ ప్రభావం చూపుతోంది.
గత మూడు సెషన్లుగా నష్టాలనే చవి చూస్తూ వస్తున్న దేశీయ సూచీలు గురువారం కాస్త కోలుకున్నాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, ఐటీ షేర్లపై ఆసక్తి సూచీలకు ఊరట కలిగించింది. అయితే డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (రూ.90.43) మరింతగా క్షీణించడంతో ఆందోళన తప్పలేదు.