Share News

RBI: సొమ్ములే సొమ్ములు .. రూ. 2.69 లక్షల కోట్ల రికార్డ్ డివిడెండ్‌ ఇస్తున్న ఆర్బీఐ

ABN , Publish Date - May 23 , 2025 | 07:44 PM

రూ. 2.69 లక్షల కోట్ల డివిడెండ్‌ ఇవ్వబోతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లించబోతోంది ఆర్బీఐ. దీంతో ఇక, సొమ్ములే సొమ్ములన్నమాట.

RBI: సొమ్ములే సొమ్ములు .. రూ. 2.69 లక్షల కోట్ల రికార్డ్ డివిడెండ్‌ ఇస్తున్న ఆర్బీఐ
RBI record dividend

ఇంటర్నెట్ డెస్క్: కేంద్రంలోని మోదీ సర్కారుకి సొమ్ములే.. సొమ్ములు, డబ్బే డబ్బు. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి రూ. 2.69 లక్షల కోట్ల డివిడెండ్‌ ఇవ్వబోతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI). 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ 2.69 లక్షల కోట్ల రూపాయల రికార్డు డివిడెండ్‌ను RBI చెల్లించనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రానికి రూ. 2,68,590.07 కోట్ల మిగులును బదిలీ చేయడానికి శుక్రవారం (మే 23, 2025) ఆమోదం తెలిపింది.

కాగా, ఇటీవల కేంద్రం ప్రకటించిన యూనియన్ బడ్జెట్‌లో ఆర్‌బీఐ సహా ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్ల రూపంలో కేంద్ర ఖజానాకు రూ.2.56 లక్షల కోట్లు సమకూరుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, ఇప్పుడు ఒక్క ఆర్‌బీఐనే అంచనాకు మించి డివిడెండ్‌ కేంద్రానికి చెల్లిస్తోంది.

RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన, భారత రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 616వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. "2018-19 నుండి 2021-22 వరకు ఉన్న అకౌంటింగ్ సంవత్సరాల్లో, ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులు, కోవిడ్-19 మహమ్మారి దాడి కారణంగా, వృద్ధి, మొత్తం ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ పరిమాణంలో CRBని 5.50% వద్ద కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది" అని RBI ఒక ప్రకటనలో తెలిపింది.


2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి ఆర్‌బీఐ రూ.2.1 లక్షల కోట్లు చెల్లించింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఈ మొత్తం 27.4 శాతం మేర పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ రూ.87,416 కోట్లు డివిడెండ్‌ రూపంలో చెల్లించింది. ప్రతి ఏడాదీ ఈ మొత్తం పెరుగుతూ వస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌ రూపంలో ఇస్తుంది. దేశ, విదేశీ సెక్యూరిటీలపై వడ్డీ, సేవలపై రుసుములు-కమీషన్లు, విదేశీ మారకపు ద్రవ్యం లావాదేవీలపై లాభం, అనుబంధ సంస్థల నుంచి ప్రతిఫలం రూపేణ ఆర్‌బీఐకు ఆదాయం వస్తూ ఉంటుంది. అయితే, కరెన్సీ నోట్ల ప్రింటింగ్, డిపాజిట్లు-రుణాలపై వడ్డీల చెల్లింపు, సిబ్బంది జీతభత్యాలు-పింఛన్లు, ఆఫీస్ ఖర్చులు, ఆకస్మిక పరిస్థితులు- తరుగుదలకు కేటాయింపులు వంటి వ్యయాలు ఉంటాయి. ఈ ఆదాయ, వ్యయాల మధ్య తేడానే మిగులు నిధులుగా వ్యవహరించి డివిడెంట్ రూపంలో కేంద్రానికి చెల్లిస్తారు.

"2022-23 ఆర్థిక సంవత్సరానికి CRBని 6.00%కి, 2023-24 ఆర్థిక సంవత్సరానికి 6.50%కి పెంచారు. సవరించిన ECF ఆధారంగా స్థూల ఆర్థిక అంచనాను పరిగణనలోకి తీసుకుని, కేంద్ర బోర్డు CRBని 7.50%కి పెంచాలని నిర్ణయించింది. దీంతో 2024-25 అకౌంటింగ్ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి మిగులుగా రూ. 2,68,590.07 కోట్లను బదిలీ చేయడానికి బోర్డు ఆమోదించింది" అని RBI ఒక ప్రకటనలో తెలిపింది.

"బోర్డు.. ప్రపంచ దేశీయ ఆర్థిక పరిస్థితిని సమీక్షించింది. దానిలో అంచనాలకు వచ్చే నష్టాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 2024 - మార్చి 2025 మధ్య రిజర్వ్ బ్యాంక్ పనితీరు గురించి కూడా బోర్డు చర్చించింది 2024-25 సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక, ఆర్థిక నివేదికలను ఆమోదించింది" అని RBI తెలిపింది.

Screenshot 2025-05-23 194814.png"మే 15, 2025న జరిగిన సమావేశంలో సెంట్రల్ బోర్డు ఆమోదించిన సవరించిన ఆర్థిక మూలధన చట్రాన్ని (ECF) ఆధారంగా సంవత్సరానికి (2024-25) బదిలీ చేయగల మిగులు నిర్ణయించబడింది. కంటింజెంట్ రిస్క్ బఫర్ (CRB) కింద రిస్క్ ప్రొవిజనింగ్‌ను RBI బ్యాలెన్స్ షీట్‌లో 7.50 నుండి 4.50% పరిధిలో నిర్వహించాలని సవరించిన ఫ్రేమ్‌వర్క్ నిర్దేశిస్తుంది" అని ఆర్బీఐ చెప్పింది.

ఈ సమావేశంలో డిప్యూటీ గవర్నర్లు ఎం. రాజేశ్వర్ రావు, టి. రబీ శంకర్, స్వామినాథన్ జె., డాక్టర్ పూనమ్ గుప్తా ఇంకా, సెంట్రల్ బోర్డులోని ఇతర డైరెక్టర్లు - ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్, ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి నాగరాజు మద్దిరాల, సతీష్ కె. మరాఠే, రేవతి అయ్యర్, ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది, పంకజ్ రామన్‌భాయ్ పటేల్, డాక్టర్ రవీంద్ర హెచ్. ధోలాకియా పాల్గొన్నారు.


Also Read:

భారీ ఖండాంతర క్షిపణిని పరీక్షించిన అమెరికా.. వీడియో వైరల్

ఎస్-400 లాంటి ఫవర్‌ఫుల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇవే..

Read Latest and Business News

Updated Date - May 23 , 2025 | 08:22 PM