-
-
Home » Mukhyaamshalu » Today Breaking News Live Updates Thursday 22nd May 2025 Top Headlines and Major Events Across India Siva
-

Breaking News: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీకి హైకోర్టు షోకాజ్ నోటీసులు
ABN , First Publish Date - May 22 , 2025 | 05:47 PM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
May 22, 2025 19:29 IST
ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీకి హైకోర్టు షోకాజ్ నోటీసులు
ఝాన్సీరెడ్డి దంపతులకు నోటీసులు జారీ చేసిన టీజీ హైకోర్టు
2017లో ఫెమా నిబంధనలను ఉల్లంఘించి.. 75 ఎకరాలు కొనుగోలు చేశారంటూ దామోదర్రెడ్డి పిటిషన్
నిబంధనలకు విరుద్ధంగా పాస్బుక్ ఇచ్చిన రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ.. సీసీఎల్ఏ కమిషనర్, కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్లకు నోటీసులు.
భూమి విషయంలో విచారణ చేసి నివేదికను ఇవ్వాలని.. ఈడీ జాయింట్ డైరెక్టర్ను ఆదేశించిన తెలంగాణ హైకోర్టు.
తొర్రూరు మం. గుర్తూరులో 75 ఎకరాలు ఝాన్సీరెడ్డి కొనుగోలు.
-
May 22, 2025 19:02 IST
తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు
పార్టీ లీడర్స్కి యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత ఆరోపణ
బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదు
మై డియర్ డాడీ అంటూ కేసీఆర్కు కవిత లేఖ
వరంగల్ సభ తర్వాత కేసీఆర్కు కవిత రాసిన లేఖలో కీలకాంశాలు
బీజేపీ మీద రెండు నిమిషాలే మాట్లాడారు.
బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడాల్సి ఉండాల్సింది.
బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటారేమో అనే చర్చ మొదలైంది.
నేను సఫర్ అయ్యాకదా.. బహుశా అందుకని కావొచ్చు.
బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సింది.
కాంగ్రెస్పై గ్రాస్రూట్స్లో నమ్మకం పోయింది.
బీజేపీ ఆల్టర్నేటివ్ అనే ఆలోచనను మన కేడర్ చెబుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా.. బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది.
KCR యాక్సెస్ దొరకడం లేదని, సెలెక్టివ్ యాక్సెస్ అని జడ్పీటీసీ,
జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యే స్థాయి నేతలు బాధపడుతున్నారు.
అందరికి అందుబాటులో ఉండేలా ప్రయత్నించండి అంటూ కవిత లేఖ
వరంగల్ సభలో ఉద్యమనేతలకు సరైన ప్రాధాన్యం దక్కలేదు.
2001 నుంచి మీతో ఉన్నవారికి మాట్లాడే అవకాశం ఇస్తే బావుండేది.
పాత ఇన్చార్జ్లకే బాధ్యతలు ఇవ్వడం కూడా కేడర్కు నచ్చలేదు.
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవారికి.. నేరుగా పార్టీ ఆఫీసు నుంచే బీ ఫామ్స్ ఇవ్వాలి.
వరంగల్ సభలో ఉర్దూలో మాట్లాడలేదు, వక్ఫ్ బిల్లుపై మాట్లాడలేదు.
ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం అంశాన్ని విస్మరించారు.
-
May 22, 2025 17:47 IST
కేటీఆర్ ముందుకు రావాలి: మహేష్ కుమార్ గౌడ్
కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై న్యాయస్థానం తీర్పు తమకు అనుకూలంగా ఇచ్చినట్లు, తామంతా నీతిమంతులైనట్లు చెప్పేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు.
నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి ఈ పథకంపై కోర్టులో కేసు వేశారు.
ఆయన పూర్తి ఆధారాలతో ఆ రోజు న్యాయస్థానంలో కేసు వేశారు.
ఆయనను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ఆ కేసును నీరుగార్చేట్లు, వీగిపోయేట్లు వ్యవహరించారు.
మీ పార్టీలో ఉన్న నాయకుడు మీ పార్టీ అధినేత కేసీఆర్పై ఎలా కొట్లాడతారు.
దీంతో తామంతా నీతిమంతులమని, చేసిన అవినీతి మాయమైనట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారు.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి ఏ విచారణ కావాలో అడగండి.
ధైర్యం ఉంటే సీఐడీ విచారణ కావాలా? జుడిషియల్ విచారణ కావాలా అన్నది ప్రభుత్వానికి లేఖ రాయండి.
అప్పుడు అవినీతి ఏవిధంగా జరిగిందో బట్టబయలవుతుంది.
నిజాయతీని నిరూపించుకునేందుకు కేటీఆర్ ముందుకు రావాలి.