-
-
Home » Mukhyaamshalu » Telangana Andhra Pradesh national and international telugu Viral trending Breaking news 18th nov kjr
-
BREAKING: గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
ABN , First Publish Date - Nov 18 , 2025 | 07:03 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 18, 2025 22:08 IST
తెలంగాణ: గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష రద్దు
2015-16 గ్రూప్-2 పరీక్షను రద్దు చేసిన హైకోర్టు
హైకోర్టు ఆదేశాలను TGPSC ఉల్లంఘించిందన్న జడ్జి
TGPSC పరిధి దాటి వ్యవహరించిందన్న హైకోర్టు
పునర్ మూల్యాంకనం చేయాలని TGPSCకి హైకోర్టు ఆదేశం
మూల్యకనం తరువాత అర్హుల జాబితా ప్రకటించాలని ఆదేశం
ఎనిమిది వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్న హైకోర్టు
-
Nov 18, 2025 21:00 IST
అమరావతి: రేపు సత్యసాయి, కడప జిల్లాలకు సీఎం చంద్రబాబు
శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు హాజరుకానున్న సీఎం
కడప జిల్లాలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల
అన్నదాత సుఖీభవ రెండో విడతలో 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్ల జమ
-
Nov 18, 2025 20:59 IST
మాజీ సైనిక ఉద్యోగి భూమిపై హైకోర్టు తీర్పు..
అమరావతి: మాజీ సైనిక ఉద్యోగి చెంచయ్యకి సర్వీసులో కేటాయించిన భూ వివాదంపై హైకోర్టులో తీర్పు
సర్వీసులో ఉన్న సైనిక ఉద్యోగులకు భూ కేటాయింపు తప్పేమి కాదు: ఏపీ హైకోర్టు
ఆ భూమిని వెనక్కి తీసుకునేందుకు వీలులేదు: హైకోర్టు
నిబంధనలు అడ్డుపెట్టుకుని మంచి ఉద్దేశాన్ని దెబ్బతీయడానికి వీలులేదు: హైకోర్టు
అడవి పోరంబోకుగా కలెక్టర్ ఎలా నిర్దారించారో అర్దంకావడం లేదన్న హైకోర్టు
22ఏ నుంచి ఆ భూమిని కలెక్టర్ తొలగించడాన్ని తప్పుపట్టిన హైకోర్టు
3 నెలల్లో భూములను నిషేదిత జాబితా నుంచి తొలగించాలి: హైకోర్టు
-
Nov 18, 2025 20:59 IST
పైరసీ చేసే వాళ్లను ఎన్కౌంటర్ చేయాలి: నిర్మాత సి.కల్యాణ్
వందలమంది కష్టం సినిమా, పైరసీని అరికట్టేందుకు ప్రభుత్వంతో కలిసివెళ్తాం: నిర్మాత సి.కల్యాణ్
టికెట్ రేట్ల పెంపుపై చాంబర్ సభ్యులతో చర్చిస్తాం: నిర్మాత సి.కల్యాణ్
-
Nov 18, 2025 16:05 IST
ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కంపెనీలపై ఈడీ దాడులు
దేశవ్యాప్తంగా ఏకకాలంలో 11 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు
బెంగళూరు 5, ఢిల్లీ 4, గురుగ్రామ్లో 2 చోట్ల సోదాలు
గేమింగ్ యాప్ నిర్వాహకుల ఇళ్లలోనూ ఈడీ తనిఖీలు
క్రిప్టో కరెన్సీ ద్వారా సంస్థ ప్రమోటర్లు మనీలాండరింగ్ చేసినట్టు గుర్తింపు
-
Nov 18, 2025 16:04 IST
విజయవాడ: భవన యజమాని కోసం పోలీసుల ఆరా
యజమాని నెలన్నర నుంచి విదేశాల్లో ఉంటున్నట్లు సమాచారం
10 రోజుల కింద మావోయిస్టులు వచ్చినట్టు పోలీసుల అనుమానం
కూలీ పనుల కోసం వచ్చామని వాచ్మెన్పై ఒత్తిడి తీసుకొచ్చి..
భవనంలోకి ప్రవేశించిన మావోయిస్టులు
వాచ్మెన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
-
Nov 18, 2025 16:04 IST
రూ. 25 కోట్ల ఆర్ధిక సాయం
కాణిపాకం దేవస్థానానికి టీటీడీ రూ. 25 కోట్ల ఆర్ధిక సాయం
టీటీడీ ప్రతిపాదనను ఆమోదించిన ఏపీ ప్రభుత్వం
యాత్రికుల కోసం భవన సముదాయం నిర్మాణానికి ఆర్థికసాయం
-
Nov 18, 2025 16:03 IST
ఏలూరులో 11 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఏలూరు గ్రీన్సిటీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
గ్రీన్సిటీలోని ఓ ఇంట్లో వారం రోజులుగా ఉన్న మావోయిస్టులు
-
Nov 18, 2025 13:51 IST
ముగిసిన ఆక్టోపస్ బలగాల సోదాలు
విజయవాడ: న్యూ ఆటో నగర్లో ముగిసిన ఆక్టోపస్ బలగాల సోదాలు..
27 మంది మావోయిస్ట్ సానుభూతిపరులని అదుపులోకి తీసుకున్న అధికారులు..
ఆపరేషన్ ఖగర్ నేపధ్యంలో అరణ్యాల ని వదిలి.. పట్టణాలలో తల దాచుకుంటున్న మావోలు..
పక్కా సమాచారంతో వారు ఉంటున్న భవనాన్ని రౌండప్ చేసి మావోలను అదుపులోకి తీసుకున్న అధికారులు..
ఐదు గంటలకు పైగా సాగిన ఆపరేషన్.
-
Nov 18, 2025 13:49 IST
ఉగ్రవాద సంస్థ పేరుతో వాట్సాప్ ఛానల్
ఢిల్లీ: ఉగ్రవాద సంస్థ జై షే మహమ్మద్ పేరుతో వాట్సాప్ ఛానల్
వాట్సాప్ ఛానల్కు 13000 మంది ఫాలోవర్లు..
ఉగ్రవాద భావజాలాన్ని వాట్సాప్ ద్వారా వ్యాపింపజేస్తున్న జై షే మహమ్మద్..
వాట్సాప్ ఛానల్ను క్లోజ్ చేసిన దర్యాప్తు అధికారులు.
-
Nov 18, 2025 13:10 IST
ట్రైన్ ఢీకొని బిటెక్ విద్యార్థిని మృతి
నెల్లూరు : కావలి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ఢీకొని బీటెక్ విద్యార్థిని మృతి
కావలి విట్స్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని
కొండాపురం మండలం సాయిపేటకు చెందిన విద్యార్థిగా గుర్తింపు..
సెల్ ఫోన్ మాట్లాడుతూ ట్రైన్కు తగిలి పడిపోయినట్లు సమాచారం..
సంఘటనా స్థలంలో విద్యా్ర్థి ఐడీ కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ లభ్యం..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు.
-
Nov 18, 2025 13:08 IST
ఎన్కౌంటర్ వివరాలు వెల్లడించిన ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ
ఎన్కౌంటర్ వివరాలు వెల్లడించిన ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్రా లడ్డా
ఈరోజు తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది..
ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు..
మావోయిస్టు కీలక నేత హిడ్మాతో పాటు ఆయన సతీమణి మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు..
మరో ఐదుగురు మావోయిస్టులు ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్నారు..
ఇటీవల మావోయిస్టులకు సహకరిస్తున్న 31 మందిని అదుపులోకి తీసుకున్నాం..
మరో 26 మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది ..
మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహిస్తాం..
మృతి చెందిన మావోయిస్టులు చత్తీష్ ఘడ్ కు చెందిన వారు..
మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం పంపిస్తున్నాం.
-
Nov 18, 2025 12:05 IST
టిప్పర్లు ఢీ.. క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్
విశాఖ: రాంబిల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన టిప్పర్ను ఢీకొట్టిన మరో టిప్పర్..
టిప్పర్ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ సాయికుమార్..
క్యాబిన్ నుంచి బయటకు తీసేందుకు ఆరు గంటలుగా శ్రమిస్తున్నా ఫలితం శూన్యం..
ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఫైర్ సిబ్బంది.. కాపాడండి అంటూ.. డ్రైవర్ సాయి కుమార్ అర్ధనాదాలు..
సాయికుమార్ను బయటకు తీసేందుకు కష్టపడుతున్న ఆయన బంధువులు..
ఉదయం ఐదు గంటలకు రాంపురం జంక్షన్ వద్ద జరిగిన ఘటన..
-
Nov 18, 2025 11:13 IST
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వాయిదా
సుప్రీంకోర్టులో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ..
కేసు విచారణను డిసెంబర్ 9 వాయిదా వేసిన ధర్మాసనం..
ప్రభాకర్ రావు తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కేసు విచారణ వాయిదా..
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం..
విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం.
-
Nov 18, 2025 10:25 IST
బ్రిలియంట్ కాలేజీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
బ్రిలియంట్ కాలేజీ చోరీ కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు
బ్రిలియంట్ కాలేజీలో 1.50 కోట్ల చోరీ కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు
అంతర్ రాష్ట్ర ముఠా కు చెందిన పలువురు అరెస్ట్ ..
సెప్టెంబర్లో పక్కా ప్లాన్తో కాలేజీలోకి చొరబడి డొనేషన్ల రూపం లో వచ్చిన డబ్బును ఎత్తుకెళ్లిన ముఠా..
ఎట్టకేలకు దొరికిన నిందితులు..
బ్రిలియంట్ కాలేజీ చోరీకి ముందు మరో రెండు కళాశాలలలోనూ ఈ తరహా చోరీలకు పాల్పడినట్టు గుర్తింపు..
12;30 గంటలకు వివరాలు వెల్లడించనున్న ఎల్బీ నగర్ డీసీపీ.
-
Nov 18, 2025 10:16 IST
హైదరాబాద్లో ఐటీ అధికారుల సోదాలు
హైదరాబాద్లోని ప్రముఖ హోటల్స్లో ఐటీ అధికారుల సోదాలు
షేక్పేట్లోని మేహిఫిల్ రెస్టారెంట్లో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు..
మేహిఫిల్లో సోదాలు చేస్తున్న రెండు ఐటీ బృందాలు..
హైదరాబాద్లో 15 హోటల్స్ నిర్వహిస్తున్న మేహిఫిల్..
ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్న మేహిఫిల్.
మేహిఫిల్ రెస్టారెంట్స్ రికార్డులను తనిఖీ చేస్తున్న ఐటీ అధికారులు ..
ఆదాయ , వ్యయాలు, ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్స్ను పరిశీలిస్తున్న ఐటీ
వాస్తవాదాయానికి రికార్డుల్లో చూపించిన ఆదాయానికి మధ్య వ్యత్యాసాలు గుర్తించిన ఐటీ అధికారులు..
అనుమానాస్పద లావాదేవీలను సైతం గుర్తించిన ఐటీ అధికారులు.
-
Nov 18, 2025 09:29 IST
20, 21న తిరుపతిలో రాష్ట్రపతి పర్యటన
తిరుపతి: ఈ నెల 20, 21 తేదీల్లో తిరుమల తిరుపతిలో పర్యటించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
నవంబర్ 20 న మధ్యాహ్నం 3.25 గం.లకు రేణిగుంట విమానాశ్రయానికి రాక..
3.55 నుంచి 4.30 గంటల వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం..
5.20 గం.లకు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహాం, రాత్రికి బస..
21వ తేదీ ఉదయం 9.30 గంటలకు శ్రీ వరాహ స్వామి దర్శనం..
10.00 గం.లకు తిరుమల శ్రీవారి దర్శనం..
10.50 గంటలకు తిరుమల నుండి బయలుదేరి ఉదయం 11.50 గంటలకు తిరుపతి విమాశ్రయం..
12.00 గంటలకు హైదరాబాద్కు ప్రయాణం.
-
Nov 18, 2025 09:25 IST
రేపు కడప జిల్లాలో సీఎం పర్యటన
కడప : రేపు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
కమలాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
పీఎం కిసాన్ , అన్నదాత సుఖీ భవ పథకాలు ప్రారంభం.. రచ్చ బండ, రైతులతో ముఖా ముఖి కార్యక్రమాలు..
-
Nov 18, 2025 09:24 IST
మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్..
మారేడుమిల్లి అడవుల్లో కొనసాగుతున్న కాల్పులు..
మావోయిస్ట్ అగ్ర నేతలు షెల్టర్ తీసుకున్నారని పోలీసులకు సమాచారం..
ఎన్ కౌంటర్లో అగ్రనేతలు మరణించినట్టు సమాచారం..
మరి కొద్దిసేపట్లో పూర్తి వివరాలు అందే అవకాశం.
-
Nov 18, 2025 07:44 IST
నందిగామలో బస్సు ప్రమాదం..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బస్సు ప్రమాదం..
అనాసాగరం ఫ్లైఓవర్పై లారీని ఢీకొన్న కావేరి ట్రావెల్స్ బస్సు..
11 మందికి గాయాలు.. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
వారిలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు..
హైదరాబాదు నుండి శ్రీకాకుళం వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు..
బస్సులో 35 మంది ప్రయాణికులు..
లారీని ఓవర్టేక్ చేయబోయి లారీని ఢీ కొట్టిన బస్సు.
-
Nov 18, 2025 07:31 IST
మరోసారి ఐటీ సోదాలు..
హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు..
ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు..
హైద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న హోటల్స్ బిజినెస్పై ఐటీ సోదాలు..
15 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.
-
Nov 18, 2025 07:30 IST
ఇద్దరు పిల్లలను గోదావరిలో తోసేసి తండ్రి ఆత్మహత్య..
అంబేద్కర్ కోనసీమ జిల్లా: మలికిపురం చించినాడ వంతెన పైనుండి తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకినట్లు సమాచారం
ఆత్మహత్య కు పాల్పడిన వారు లక్కవరం గ్రామానికి చెందిన వారుగా గుర్తింపు..
సంఘటన స్థలంలో బైక్, చెప్పులు, సెల్ పోన్, పాన్ కార్డు గుర్తించిన పోలీసులు..
పాన్ కార్డు ఆదారంగా సిరిగినీడి దుర్గాప్రసాద్గా గుర్తింపు.
-
Nov 18, 2025 07:17 IST
పేలిన గ్యాస్ సిలిండర్.. ఆరుగురికి తీవ్ర గాయాలు..
సిద్ధిపేట జిల్లా: చేర్యాల మండలం ఆకునూర్లో పేలిన గ్యాస్ సిలిండర్..
గ్యాస్ స్టౌవ్ వెలింగించగా గ్యాస్ లీక్ అయి పెద్ద శబ్దంతో పేలిన సిలిండర్.. ఇంట్లో చెలరేగిన మంటలు..
ఇల్లు దగ్ధమవడంతో ఆరుగురికి తీవ్ర గాయాలు..
క్షతగాత్రులను చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
-
Nov 18, 2025 07:03 IST
నేడు టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం..
తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం..
వైకుంఠ ఏకాదశి దర్శన విధి.. విధానాల అమలుపై నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి..
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ముందుగానే ఆన్లైన్లో జారీ చేయాలని నిర్ణయం..
అధికారుల ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి..
తిరుపతిలో గత ఏడాదిగా నిలిచిపోయిన చిన్న పిల్లల ఆస్పత్రితో పాటు స్విమ్స్లో ఆగిన పలు నిర్మాణాలకు నిధులు మంజూరు చేయనున్న బోర్డు..
పలు కొనుగోళ్లు, ఇంజనీరింగ్ పనులకు ఆమోదం తెలపనున్న బోర్డు.