MAT 2025 Exam: మ్యాట్ 2025 సెప్టెంబర్ సీజన్
ABN , Publish Date - Jul 28 , 2025 | 08:13 AM
ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ‘మ్యాట్ 2025’ సెప్టెంబర్ సీజన్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో మేనేజ్మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఉద్దేశించిన ప్రధాన ఎంట్రెన్స్ల్లో ‘ద మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్’(మ్యాట్) ఒకటి. ఈ ఎంట్రెన్స్ను 1988 నుంచి నిర్వహిస్తున్నారు.

సీబీటీ - పీబీటీ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ‘మ్యాట్ 2025’ సెప్టెంబర్ సీజన్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో మేనేజ్మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఉద్దేశించిన ప్రధాన ఎంట్రెన్స్ల్లో ‘ద మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్’(మ్యాట్) ఒకటి. ఈ ఎంట్రెన్స్ను 1988 నుంచి నిర్వహిస్తున్నారు. 2003 నుంచి కేంద్ర విద్యామంత్రిత్వశాఖ దీనిని జాతీయ స్థాయి పరీక్షగా గుర్తించింది. ఇది పేపర్ బేస్డ్ టెస్ట్(పీబీటీ), కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) మోడల్లో ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు మోడల్స్కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. అభ్యర్థులు తమ సౌకర్యాన్ని, ఆసక్తినిబట్టి ఈ రెంటిలో ఒకటి కానీ, రెంటినీ కానీ ఎంచుకోవచ్చు. మ్యాట్ స్కోరు వ్యాలిడిటీ ఒక సంవత్సరం ఉంటుంది. దేశవ్యాప్తంగా 600 పైగా బిజినెస్ స్కూల్స్ ఈ స్కోరు ద్వారా అడ్మిషన్ కల్పిస్తాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు. అయితే కౌన్సెలింగ్ సమయంలోపు సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం:
మ్యాట్ ఎంట్రెన్స్ నిర్ణీత సమయం రెండు గంటలు. ఇందులో ఐదు సెక్షన్లు ఉంటాయి. ప్రతీ సెక్షన్లో ముప్పై ప్రశ్నలు అంటే మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఈ ఎంట్రెన్స్లో నెగెటివ్ మార్కింగ్ ఉంది. తప్పుగా గుర్తించిన ప్రతీ సమాధానికి పావు మార్కు తగ్గిస్తారు.
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 30
ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్ 30
మేథమెటికల్ స్కిల్స్ 30
డేటా అనాల్సిస్ అండ్ సఫిసియన్సీ 30
ఎకనామిక్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ 30
ఫీజు: పీబీటీ లేదా సీబీటీల్లో ఏదో ఒకటే రాయాలనుకున్న అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.2200/-. రెండు ఎంట్రెన్స్లు రాయాలనుకున్న అభ్యర్థులు అదనంగా రూ.1600/- చెల్లించాల్సి ఉంటుంది.
ఫలితాలు: 2025 అక్టోబర్ రెండోవారంలో విడుదల చేస్తారు.
వెబ్సైట్: mat.aima.in
పీబీటీ ఎగ్జామ్
పరీక్ష తేదీ: 2025 సెప్టెంబర్ 21
రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 15
హాల్ టికెట్ల విడుదల: 2025 సెప్టెంబర్ 18
సీబీటీ ఎగ్జామ్
పరీక్ష తేదీ: 2025 సెప్టెంబర్ 28
రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 22
హాల్ టికెట్ల విడుదల: 2025 సెప్టెంబర్ 25
ఈ వార్తలు కూడా చదవండి
అలర్ట్.. పరీక్షల విషయంలో కొత్త రూల్స్ జారీ..
ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులకు శుభవార్త!
For More Educational News And Telugu News