Hyderabad: సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. నల్లా బిల్లులంటూ మోసం
ABN , Publish Date - May 31 , 2025 | 08:43 AM
హైదరాబాద్ నగరంలో మరో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వాటర్ బోర్డు అధికారులమని, నల్లా బిల్లులంటూ మోసానికి తెరలేపారు. ఇప్పటికే నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ సైబరఫ మోసం జరుగుతూనే ఉంది.

- కనెక్షన్లు తొలగిస్తామంటూ ఎస్ఎంఎస్లు
- అప్రమత్తంగా ఉండాలని వాటర్బోర్డు హెచ్చరిక
హైదరాబాద్ సిటీ: కొందరు సైబర్ కేటుగాళ్లు డబ్బులు కొల్లగొట్టేందుకు కొత్త ఎత్తుగడలతో వాటర్బోర్డు(Water Board) వినియోగదారులను మోసం చేస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని బోర్డు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొబైల్నంబర్ 84271 56645నుంచి నీటి బిల్లు చెల్లించకపోతే మీ నల్లా కనెక్షన్లు తొలగిస్తామని, మరిన్ని వివరాలకోసం 9064953421ను సంప్రదించాలని మెసేజ్ చేస్తున్నారని,
ఇదీ కొత్త తరహా సైబర్ మోసమని తెలిపారు. ఆ నంబర్ను సంప్రదించగానే ప్రాసెసింగ్ కోసమని ఏపీకే ఫైల్ను వాట్సాప్(WhatsApp) ద్వారా పంపిస్తారని, వాటిని పట్టించుకోవద్దని సూచించారు. ఈ మెసేజ్లతో వాటర్బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని, ఇటువంటి సందేశాలకు నగరవాసులు స్పందించవద్దని తెలిపారు. ఏవైనా సమస్యలు, ఇతర సందేహాలుంటే వాటర్బోర్డు కస్టమర్ కేర్ 155313 నంబర్లో సంప్రదించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు
NIA raids: వరంగల్లో ఉగ్ర కలకలం!
Read Latest Telangana News and National News