Home » Cyber attack
ఇన్స్టాగ్రామ్ లింక్పై నమ్మి రూ.2.46 కోట్లు కోల్పోయిన మహిళ కేసులో ఏడుగురు సైబర్ నేరగాళ్లను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు.తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలని మోసగాళ్లు నమ్మించి మోసం చేశారు.
సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఆన్లైన్లో అవకాడోలు బుక్ చేసిన వ్యక్తిని మాయ చేసి సైబర్ నేరగాళ్లు రూ.2.60 లక్షలు కొల్లగొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్సటికే ఎన్నో అక్రమార్గాలను ఎంచుకుని బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలన కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు తాజాగా మరో కొత్త ప్లాన్ తో రూ.2.60 లక్షలు దోచేశారు.
Army Nursing College: గతంలోనూ టీమ్ ఇంసేన్ పాక్ గ్రూపు గతంలోనూ సైబర్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వ, ఇతర వెబ్ సైట్లను హ్యాక్ చేయడానికి ఈ గ్రూపు ప్రయత్నించింది. 2023 జీ20 సమ్మిట్ సమయంలోనూ ప్రభుత్వ వెబ్ సైట్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తరచుగా సైబర్ దాడులకు పాల్పడుతూ విఫలం అవుతూ వస్తోంది.
సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలకు తెరలేపారు. ఇప్పటికే వివిధ పద్దతుల్లో కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్న ఈ కేటుగాళ్లు తాజాగా.. నకిలీ వెబ్సైట్ సృష్టించి భక్తులను దోచుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరం సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ సైబర్ మోసం జరుగుతూనే ఉంది. నగరంలోని ఓ ఏరియాకు చెందిన వృద్ధుడి(78)ని బురిడీ కొట్టించి రూ.3.99లక్షలు కొట్టేశారు. ఈ సైబర్ నేరాలపై ఇంకా ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండటం, సైబర్ మోసగాళ్లు పోలీసుల మాదిరిగా, బ్యాంకు అధికారుల లాగే మాట్లాడుతుండడంతో మోసపోవాల్సి వస్తోంది.
ఒకటి కాదే.. రెండుకాదు.. మొత్తం రూ52.29 లక్షలు దోచేశారు. సైబర్ మోసాలపై సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నా.. ప్రజల్లో ఇంకా అంత అవగాహన లేకపోవడంతో ప్రజలు పెద్దఎత్తున నష్టపోతూనే ఉన్నారు. తాజాగా రూ52.29 లక్షలు దోచేసిన విషయం హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇప్పటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా మన నిత్య జీవితంలో భాగమైన వాట్సాప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడైనా మీది లేదా తెలిసిన వారి వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయితే ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నగరంలో సైబర్ మోసాలు పెట్రేగిపోతున్నాయి. ప్రజల ఆర్ధిక అవసరాలను అడ్డం పెట్టుకొని బ్యాంకుల నుంచి రుణాలిస్తామంటూ నమ్మబలికి ఉన్నది మొత్తం ఊడ్చేస్తున్నారు. రూ.15లక్షల రుణం కోసం సంప్రదిస్తే నగరవాసి నుంచి రూ.44.83 లక్షలు కాజేశారు విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నగరంలో.. సైబర్ నేరగాళ్ల మోసాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతారోజూ ఎక్కడో ఒకచోట ఈ తరహ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మహిళ ఈ సైబర్ మోసాని బలైంది. మొత్తం 1.35 లక్షలు పోగోట్టుకుంది.
How To Identify AI Generated Aadhaar cards: దేశంలో ఆధార్ ఎంత కీలకమైన గుర్తింపు కార్డో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఆర్థిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ కొందరు నేరగాళ్లు ఎలాన్ మస్క్, ట్రంప్, ఆర్యభట్ట ఇలా ఎవరి పేరుతో కావలిస్తే వారి పేరుతో ఆధారు గుర్తింపు కార్డులు సృష్టిస్తూ జనాలను దోచుకునేందుకు కొత్త దోపిడీకి తెర తీశారు.