Home » Cyber Crime
సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటివరకు కేవలం యువకులే ఈ మోసాలకు పాల్పడగా తాజాగా... మహిళలు కూడా ఈ తరహ మోసాలకు పాల్పడడం విశేషం. నగరంలో ఓ వ్యక్తిని సైబర్ కి‘లేడీ’ మోసగించి రూ.24.44 లక్షలను దోచేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సైబర్ నేరగాళ్లు మరో మోసానికి తెరలేపారు. ప్రముఖ సంస్థల పేర్లు వాడుకుంటూ.. ఆఫర్లు ఉన్నాయంటూ మోసాలకు పాల్పడుతున్నారు. నగరంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ సైటర్ మోసగాళ్ల చేతిలో బలవుతూనే ఉన్నారు. లక్షలాది రూపాయలను పొగొట్టుకుంటూనే ఉన్నారు.
సైబర్ నేరగాళ్లు ఈ పాన్ కార్డు పేరిట మోసాలకు తెరతీశారు. ఫిషింగ్ మెయిల్స్ను పంపి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆపదలో ఉన్నాడని పాపం తలచి ఫోన్ ఇస్తే అకౌంట్లలోని నగదును కాజేసే వినూత్న సైబర్ నేరాలకు పాల్పడేవారు తారసపడుతున్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారు కీప్యాడ్ ఫోన్లు వాడుతుంటారు.
హైదరాబాద్ నగరం సైబర్ మోసాలకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఈ మోసాలకు ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళ రూ.29.5 లక్షలను పోగొట్టుకుంది. ఇందకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసుపై నాంపల్లి కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నిందితుడు రవిని మూడోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే మరో నాలుగు కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
హైదరాబాద్కు చెందిన పలువురిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి లక్షలాది రూపాయలను కొట్టేసిన విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.8.24 లక్షలను కొల్లగొట్టారు. తమ ఖాతాల్లో ఉన్న నగదు మాయం కావడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన రెండు వెబ్ సైట్లు హ్యాక్కు గురయ్యాయి. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో వారం రోజులుగా వెబ్ సైట్లు పని చేయని పరిస్థితి.
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. నకిలీ యాప్ ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకుంటూ ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. అయితే.. ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది,
సైడర్ కేటుగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అందంగా ఉన్న అమ్మాయిల ఫొటోలు వాట్సాప్ డీపీగా పెట్టి వలపు వల విసిరి... లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగాగా ఇటువంటా సంఘటనే నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.