Home » GHMC
జీహెచ్ఎంసీని ఔటర్ అవతలి వరకు విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయగానే ఆ మేరకు బిల్డ్నౌలో మార్పులు చేశారు. కేవలం వెయ్యి చదరపు మీటర్లలోపు ఏడు అంతస్తుల వరకు భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేవిధంగా బిల్డ్నౌలో సాంకేతిక మార్పులు తీసుకొచ్చారు.
నగరంలో.. కుక్కలు స్వైరవిహరం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు దర్శనమిస్తున్నాయి. దీంతో వీధుల్లోకి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకూ 300 వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయంటే.. ఇక పరిస్థితి ఏంటో ఇట్టే ఊహించుకోవచ్చు.
భాగ్యనగరంలో.. ఈవెంట్ గ్రౌండ్ ఏర్పాటవుతోంది. ప్రసాద్ మల్టీప్లెక్స్కు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహానికి మధ్యన ఉన్న మూడెకరాల స్థలంలో ఈ మైదానాన్ని ముస్తాబు చేస్తున్నది. ఈ ఈవెంట్ గ్రౌండ్ను హైదరాబాద్ మెట్రో డవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఏర్పాటుచేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్యను 150 నుంచి 300కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోకి మొత్తం 20 మునిసిపాల్టీలు, ఏడు కార్పొరేషన్లను విలీనం చేశారు. ఈ మేరకు దానికి సంబంధించిన పనులన్నీ బుధవారం రాత్రి పూర్తయ్యాయి. దీంతో ఆ ఏరియాలన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. వివరాలిలా ఉన్నాయి.
జీహెచ్ఎంసీ పరిధి విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కోర్ అర్బన్ రీజియన్ విస్తరింపును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. కోర్ అర్బన్ రీజియన్లో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ విలీనం చేయనుంది.
భాగ్యనగరంలో తొలిసారిగా ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ అందుబాటులోకి రానుంది. ఆదివారం నుంచి జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద ప్రారంభించనుంది జీహెచ్ఎంసీ.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీన ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. చుట్టూ ఉన్న గ్రామాల విలీనం తర్వాత జీహెచ్ఎంసీ పరిధి మరింత పెరగనుంది విలీనం పూర్తయితే ప్రస్తుత బల్దియా విస్తీర్ణంతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా మెగా జీహెచ్ఎంసీ ఉండనుంది.
మొత్తం 2,735 చ.కి.మీటర్లతో హైదరాబాద్ నగరం విస్తరించింది. హైదరాబాద్... ఇప్పుడు అతిపెద్ద నగరం. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని, అవతల గల 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు.
తాగునీటితో కారు కడిగిన వ్యక్తికి అధాకారులు రూ.10వేల జరిమానా విధించారు. ఈ విషయం బంజారాహిల్స్లో జరిగింది. తాగే నీటితో వాహనాలు కడగడం కొందరికి పరిపాటిగా మారింది. దీనిపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. జరిమానాలు విధిస్తున్నారు.