Somireddy Slams Jagan: లిక్కర్ కేసులో అసలు బాస్ ఆయనే.. సోమిరెడ్డి హాట్ కామెంట్స్
ABN , Publish Date - Jul 17 , 2025 | 10:25 AM
Somireddy Slams Jagan: చంద్రబాబు ఇళ్లు, పార్టీ కార్యాలయంపై దాడులు ఎందుకు చేయించారని ఎమ్మెల్యే సోమిరెడ్డి నిలదీశారు. జగన్ బుద్దిమంతుడు.. తాము అరాచకవాదులమా అంటూ ఫైర్ అయ్యారు.

నెల్లూరు, జులై 17: ఏపీ లిక్కర్ కేసులో అసలు బాస్ జగనేనని (Former CM YS Jagan Mohan Reddy) ప్రపంచానికి తెలిసిపోయిందని.. ఆ భయంతోనే ఈ తీరున వ్యవహారిస్తున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy Chandramohan Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు (గురువారం) ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. జగన్ డిప్రెషన్లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ‘సినిమాల్లో విలన్స్ నరికేయండి.. ఆ నా కొడుకుని అని అంటారు.. నువ్వు కూడా అదే డైలాగ్ చెబుతావా? ఇటువంటి వాళ్లని చూస్తే రాజకీయాల్లోకి ఎందుకొచ్చామా అనిపిస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. టీడీపీ ముఖ్య నేతలు ఏమి చేశారని జైళ్లకి పంపారని ప్రశ్నించారు.
చంద్రబాబు ఇళ్లు, పార్టీ కార్యాలయంపై దాడులు ఎందుకు చేయించారని నిలదీశారు. జగన్ బుద్దిమంతుడు.. తాము అరాచకవాదులమా అంటూ ఫైర్ అయ్యారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని విమర్శించారు. ‘11 సీట్లుతో ప్రజలు ఈడ్చికొట్టారు. అసెంబ్లీకి రావంటావా? రిజైన్ చేయి, మీ ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించు. సిట్ కేసులో రూ.3200 కోట్లు ఎక్కడికి పోయాయో చెప్పు. నోరు మెదపవే. నీ మద్యం తాగించి 33 మందిని చంపేశావ్? లక్షల మందిని బెడ్ ఎక్కించావ్?’ అంటూ జగన్పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు
Read Latest AP News And Telugu News